ఈ వారం టాలీవుడ్లో మూడు ముక్కలాట..!
ఇక లవ్ స్టోరీ హిట్ ట్రాక్ కంటిన్యూ చేసే క్రమంలో దసరా సందర్భంగా టాలీవుడ్ కొత్త సినిమాలతో మరింత కళ కళ లాడింది. ఇందులో శర్వానంద్ - సిద్ధార్థ్ నటించిన మల్టీస్టారర్ మూవీ మహాసముద్రం ఫ్లాప్ అయ్యింది. అఖిల్ - పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్ అయ్యింది. ఎట్టకేలకు అఖిల్ ఖాతాలో ఫస్ట్ హిట్ పడింది. అయితే పెళ్లిపందడి ప్లాప్ అయినా కొన్ని ఏరియాల్లో మాత్రం మంచి వసూళ్లే సాధించింది.
ఇక ఈ శుక్రవారం ఏకంగా మూడు సినిమాలు థియేటర్ల లోకి దిగ బోతున్నాయి. కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటిగా పరిచయమవుతున్న నాట్యం సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్లు కూడా బాగా చేస్తుండగా .. ఈ సినిమాకు రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించారు.
ఇక తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా అంటూ ప్రచారం జరుగుతోన్న అసలేం జరిగింది కూడా వస్తోంది. శ్రీరామ్ కథా నాయకుడు. ఇక మధుర వైన్స్ సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూడు సినిమా లతో పాటు ఓటీ టీలో మరో రెండు సినిమాలు వస్తున్నాయి. మరి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా హిట్ కొడుతుందో ? చూడాలి.