చిరు చేస్తున్న మూడు సినిమాల్లో ఆ సినిమా నే హైలైట్!!

P.Nishanth Kumar
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్లే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఆయన హీరోగా చేసిన ఆచార్య సినిమా ఫిబ్రవరి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్న మెగా అభిమానుల కోరిక తీరబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ యాక్షన్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఈ సినిమా నుంచి విడుదలైన అప్ డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ ఆ తర్వాత దర్శకుడు బాబీ తో కలసి వాల్తేరు వీరన్న అనే సినిమా లను చేస్తున్నాడు. వీటిలో ముందుగా గాడ్ ఫాదర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే విధంగా చిరంజీవి ప్రణాళికలు వేస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తుండగా సత్యదేవ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది.

ఈ సినిమా మొదలు పెట్టిన కొన్ని రోజులకే మెగాస్టార్ చిరంజీవి తాను చేయబోయే తదుపరి రెండు చిత్రాలను కూడా మొదలు పెట్టబోతున్నాడని చెబుతున్నారు. దాంతో ఒకేసారి మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకు వెళ్లి అతి తక్కువ కాలంలోనే వీటిని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిరంజీవి ఆలోచన. ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ అలాగే భోళా శంకర్ సినిమాలు రీమేక్ సినిమాలే కాగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరన్న సినిమాపై చిరంజీవి కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడట. ఇది తప్పకుండా తన కెరీర్లో వైవిధ్యభరితమైన ఉండడంతో పాటు ఇది సూపర్ హిట్ సినిమా అయ్యే సూచనలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడట. మొత్తానికి చిరు చేయబోయే మూడు సినిమాలలో వాల్తేరు వీరన్న సినిమాపైనే అందరూ అంచనాలు గట్టిగా పెట్టుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: