కోర్టు మెట్లెక్కిన సమంత.. ఎందుకో తెలుసా?

praveen
గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో అక్కినేని వారి మాజీ కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ గా ఉన్న నాగచైతన్య, సమంత ఎవరూ ఊహించని విధంగా విడాకులు తీసుకుంటున్నట్లు  ప్రకటించి షాకిచ్చారు. అయితే వీరిద్దరి విడాకులపై ఎన్నో రోజుల నుంచి వార్తలు వస్తున్నప్పటికీ అవన్నీ కేవలం అవాస్తవం మాత్రమే అంటూ కొట్టిపారేశారు తెలుగు ప్రేక్షకులు. కానీ ఆ తర్వాత వీరిద్దరు నిజంగానే విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో షాక్ అయ్యారు అని చెప్పాలి. అయితే ఎప్పుడూ ఒకరి పై ఒకరు అమితమైన ప్రేమను చూపించుకునే వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అన్నది ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 వీరిద్దరు  విడి పోవడానికి గల కారణాలు ఏంటి అన్నది మాత్రం వీరిద్దరు స్పందించి చెప్పింది లేదు. కానీ వీరిద్దరూ విడిపోవడానికి  ఏవేవో కారణాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త చేస్తూనే వచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ సమంత ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గుర్తించారు.  అంతేకాదు సమంత గురించి పలు యూట్యూబ్ ఛానల్స్ కూడా తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి.  ఒకసారి ఇలా తనపై వస్తున్న తప్పుడు ప్రచారం పై స్పందించిన సమంత తాను విడాకుల బాధలో ఉన్న సమయంలో ఇలా ఎటాక్ చేయడం సరికాదు అంటూ వ్యాఖ్యానించింది.

 ఇప్పటికీ సమంత పై వస్తున్న పుకార్లు మాత్రం ఆగలేదు. అయితే సమంతపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై.. తన పరువు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించిన 3 యూట్యూబ్ ఛానల్స్ ఫై ఇటీవలే పరువు నష్టం దావా కేసు నమోదు చేసింది సమంత  కూకట్పల్లి కోర్టులో పరువు నష్టం దావా కేసు వేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్న సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ తో పాటు వెంకట్ రావు అనే అడ్వకేట్ కూడా పరువుకు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించారు అంటూ పిల్ దాఖలు చేసింది సమంత. అయితే మరి కాసేపట్లో హైకోర్టు న్యాయవాది బాలాజీ ఇక కూకట్పల్లి కోర్టులో సమంత తరఫున  వాదనలు వినిపించనున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: