హోస్ట్ గా మారనున్న కీర్తి సురేష్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో టాలీవుడ్ లో కీర్తి సురేష్ వరుస సినిమా ఆఫర్ లను కొట్టేసింది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన మహానటి సినిమా తో కీర్తి సురేష్ కు ఎనలేని పేరు ప్రతిష్టలు దక్కాయి. ఆ తర్వాత కూడా అనేక స్టార్ హీరోల సినిమాలలో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ల సరసన చేరిపోయిన కీర్తి సురేష్, ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా తో పాటు చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలు గా నటిస్తోంది, ఇలా తెలుగులో స్టార్ హీరోల సినిమాలలో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న  ఈ ముద్దుగుమ్మ ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారం కాబోయే ఒక టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించబోతునట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సమంత, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు కూడా ప్రముఖ షో లకు హోస్ట్ లుగా వ్యవహరించి జనాలను ఎంతో అలరించారు. అయితే కీర్తి సురేష్ కూడా వారి బాటలోనే నడవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే కాస్త వెరైటీగా కీర్తి సురేష్ హోస్ట్ గా వ్యవహరించే షో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ టాక్ షో  ఒకే సారి నాలుగు భాషల్లో టెలీకాస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కీర్తి సురేష్ కు మంచి క్రేజ్ ఉండడం వల్ల ఈ నాలుగు భాషల్లో టెలికాస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: