నెగిటివ్ కూడా ఆనందాన్ని ఇచ్చింది : ప్రగ్యా జైస్వాల్
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ప్రగ్యా జైస్వాల్. అయితే ఇక హోమ్ క్వారంటైన్ లో ఉంటూ ప్రత్యేకమైన చికిత్స తీసుకుంటూ ఇటీవలే కరోనా వైరస్ ను ప్రగ్యా జైస్వాల్ జయించింది. ఇక ఇటీవల ఈ విషయాన్ని అభిమానులకు తెలిపింది. దీంతో అభిమానులు అందరూ సంతోషం లో మునిగిపోయారు.ఇటీవలే తాను కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోగా అందులో నెగిటివ్ వచ్చింది అంటూ చెప్పిన ప్రగ్యా జైస్వాల్ ఆనందం వ్యక్తం చేసింది. అంతేకాకుండా పలు కామెంట్స్ కూడా చేసింది ప్రగ్యా జైస్వాల్.
నెగిటివ్ అనే పదం ఎప్పుడూ సంతోషాన్ని ఇస్తుంది అని నేను అనుకోలేదు..కానీ మొదటిసారి నెగటివ్ అనే పదం కూడా సంతోషాన్నిస్తుంది అంటూ ప్రగ్యా జైస్వాల్ తనకు కరోనా నెగిటివ్ వచ్చింది అనే విషయాన్ని తెలిపింది . అయితే ఇప్పటికే ప్రగ్యా జైస్వాల్ వ్యాక్సిన్ తీసుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే గతంలో కూడా ఓసారి ప్రగ్యా జైస్వాల్ కరోనా వైరస్ బారిన పడు పడింది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ రెండవసారి కూడా ప్రగ్యా జైస్వాల్ కు వైరస్ పాజిటివ్ రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇకపోతే ప్రస్తుతం ఈ అమ్మడు అటు బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే పలుమార్లు బాలయ్య సరసన హీరోయిన్గా నటించింది ఈ ముద్దుగుమ్మ.