మా ఎలక్షన్ లను ఉద్దేశించి బాబు మోహన్ సంచలన కామెంట్స్..!

Pulgam Srinivas
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల ప్రక్రియ ఎంత రసవత్తరంగా జరిగిందో మ న అందరికీ తెలిసిందే, ఎన్నికల ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా కానీ ఈ కుంపటి మాత్రం ఆరడం లేదు. మా ఎన్నికల లో రోజు కో ట్విస్ట్ బయటకు వస్తుంది. ఎన్నికల ప్రక్రియ అంతా ఒక ఎత్తు అయితే ఎన్నికలు జరిగిన రోజు జరిగిన రచ్చ గురించి మన అందరికీ తెలిసిందే. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య మా ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎంతో రసవత్తరంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికల్లో గెలుపొందిన మంచు విష్ణు ఇప్పటికే అధ్యక్ష పదవి పీఠాన్ని వర్ణించాడు. అయితే మంచు విష్ణు ప్యానె ల్ సభ్యులు రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ సీసీ టీవీ పుటేజ్ ను తన కు అందించాలి అని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపిస్తున్నారు.

 ఈ విషయం పై స్పందించిన మంచు విష్ణు ప్రకాష్ రాజ్ సీసీ టీవీ పుటే జ్ తీసుకోవచ్చు అని తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అని తెలియ జేశాడు. ఇది లా ఉంటే.. ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపణలపై మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులతో కలిసి ఈ రోజు ప్రెస్ మీట్  ను  నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు బాబు మోహన్ షాకింగ్ కామెంట్ చేశాడు. బాబూ మోహన్ మాట్లాడుతూ.. మా లోని ప్రతి సభ్యుడికి మంచు విష్ణు అధ్యక్షుడు అని అన్నారు. అంగీకరించకపోతే రెండు రాష్ట్రాల ప్రజలు క్షమించరని.. ఇంకో రెండేళ్లు కూడా విష్ణునే అధ్యక్షుడి గా గెలుస్తాడని బాబు మోహన్ పేర్కొన్నాడు. ప్రకాష్ రాజ్ ప్యాన ల్ సభ్యులు ఆవే శం తగ్గించుకోవాలని, తెలుగు మాట్లాడడం సరిగ్గా రాదు అన్న వ్యక్తి హైస్కూల్ ‏లో చదివాడని, కానీ విష్ణు యూనివర్సిటీ సీఈవో అని మోహన్ బాబు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: