మెగా హీరోలకి అచ్చిరాని రోజు ఏంటో తెలుసా..?

Anilkumar
సినీ ఇండస్ట్రీపై కరోనా ప్రభావం చాలా గట్టిగానే పడిందనే చెప్పాలి.ఇప్పటివరకు ఇది కొనసాగుతూనే ఉంది.ఈ నేపథ్యంలో చాలామంది స్టార్ హీరోలు తమ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.ఇక వీరిలో చాలావరకు మెగా హీరోల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉంటడం గమనార్హం.అయితే ఏ ఒక్క సినిమా కూడా కరోనా ప్రభావితంతో రిలీజ్ కి నోచుకోలేకపోయాయి.అందులో కరోనా ప్రభావం ఒకటైతే..మరొకటి ఈ హీరోలకు ఉన్న సెంటిమెంట్ కలిసి రాలేదని చెప్పొచ్చు.ముఖ్యంగా మెగా హీరోలకు చాలావరకు ఓ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవ్వడం లేదు.ఆ వివరాల్లోకి వెళ్తే.. 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఆచార్య'.రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని ముందు మే 13 న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. కానీ ఆ డేట్ కి సినిమా విడుదల కాలేదు.అటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' సినిమా ఆగస్టు 13 న విడుదల చేస్తున్నట్లు ముందు ప్రకటించినా..ఈ సినిమాను కూడా ఆ రోజున విడుదల చేయలేక పోయారు మేకర్స్.ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమాని కూడా ముందు అక్టోబర్ 13 న విడుదల చేస్తామని అనుకున్నా ..

షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ డేట్ కూడా వాయిదా పడింది.అలా ఈ మెగా హీరోల సినిమాలన్నీ ముందు ఫిక్స్ చేసిన డేట్స్ కి విడుదల అవ్వలేదు. అయితే ఆ సినిమాలు విడుదల కాకముందే..మరొక సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు మెగా హీరోలు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మెగా హీరోలందరికి 13 వ తేదీ అనేది కలిసి రావడం లేదు.ఆచార్యని మే 13,పుష్ప ని ఆగస్టు 13, ఆర్ ఆర్ ఆర్ ని అక్టోబర్ 13 తేదీలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. కానీ ఈ సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఇప్పటికే కొత్త రిలీజ్ డేట్స్ ను సెట్ చేసుకున్నాయి.కాబట్టి మెగా హీరోలందరికి ఈ 13 వ తేదీ అనేది అచ్చిరాలేదనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: