సన్నీలియోన్ ఊపుడుని.. బన్నీ తట్టుకుంటాడా..?

NAGARJUNA NAKKA
పాన్ ఇండియన్ మూవీస్‌కి హీరోయిన్లు దొరుకుతున్నారు గానీ, అందులో స్పెషల్‌ సాంగ్స్‌కి మాత్రం హీరోయిన్లు దొరకడం లేదు.  తెలుగు మార్కెట్‌ని మేనేజ్‌ చేస్తూ, హిందూ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే హీరోయిన్ల కోసం మేకర్స్‌ చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఇద్దరు స్టార్స్‌ కోసం ఐటమ్‌ గర్ల్స్‌ని తీసుకురావడం పెద్ద ఛాలెంజింగ్‌గా మారిందట.
ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వస్తోన్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ 'సలార్'. 'కెజిఎఫ్' తర్వాత ప్రశాంత్‌ నీల్‌ డైరెక్ట్‌ చేస్తోన్న ఈ మూవీపై సౌత్‌తో పాటు నార్త్‌లోనూ పాజిటివ్‌ బజ్ ఉంది. 'బాహుబలి' ప్రభాస్‌తో ప్రశాంత్‌ ఎలాంటి మేజిక్స్ చేయిస్తాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అంచనాలని మరింత పెంచడానికి బాలీవుడ్‌ గ్లామర్‌ యాడ్‌ చేస్తున్నారు మేకర్స్.
'సలార్‌'లో ఒక స్పెషల్‌ సాంగ్‌ కోసం శ్రద్ధా కపూర్‌ని తీసుకుంటున్నారనే టాక్ వస్తోంది. ఇంతకుముందు వీళ్లిద్దరు 'సాహో' సినిమాలో కలిసి నటించారు. ఈ పెయిర్‌కి తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ రెస్పాన్స్‌ వచ్చింది. అందుకే 'సలార్'లో శ్రద్ధాని స్పెషల్‌ సాంగ్‌కి తీసుకుంటున్నారట. ఇంతకుముందు కత్రీన కైఫ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ వచ్చింది గానీ, ఫైనల్‌గా శ్రద్ధాని కాంటాక్ట్ చేశారని తెలుస్తోంది.
అల్లు అర్జున్‌ రగ్గడ్‌ లుక్‌లో న్యూ మేకోవర్‌తో కనిపించిన సినిమా 'పుష్ప'. ఈ మూవీ అయిదు భాషల్లో విడుదల కాబోతోంది. తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కబోతోంది. అయితే నార్త్‌ మార్కెట్‌లో బిజినెస్‌ పెంచడానికి బాలీవుడ్‌ బ్యూటీతో ఒక స్పెషల్‌ సాంగ్‌ చేయించబోతున్నారు మేకర్స్.
'పుష్ప' సినిమాలో బాలీవుడ్‌ దివా దిశా పఠాని ఐటెమ్‌ సాంగ్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న దిశ స్పెషల్‌ సాంగ్‌ చేస్తే సినిమాకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారట. అయితే ఇంతకుముందు వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ సన్నీ లియోన్‌ స్పెషల్ సాంగ్‌ చేస్తుందనే టాక్ వచ్చింది. మరి వీళ్లిద్దరిలో బన్నితో ఎవరు స్టెప్పులేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: