అదిరిపోయే లైనప్ ను సెట్ చేసుకున్న ప్రశాంత్ నీల్..!

Pulgam Srinivas
ప్రస్తుతం ఇండియా వైడ్ గా మారుమోగుతున్న దర్శకుల పేర్లలో ప్రశాంత్ నీల్ పేరు ఒకటి. యాష్ హీరోగా కేజిఎఫ్ చాప్టర్ వన్ సినిమా ను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమా  ఇండియా వైట్ గా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఈ దర్శకుడికి కూడా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఈ సినిమా సాధించిన విజయం తో యాష్ స్టార్ హీరో గా ఎదగగా, ప్రశాంత్ నీల్ కు కూడా అదే రేంజ్ లో క్రేజ్ వచ్చి పడింది. కేజిఎఫ్ చాప్టర్ వన్ తో పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే బ్లాక్ బస్టర్ ను చూసిన ప్రశాంత్ నీల్, కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమాను కూడా దాదాపుగా పూర్తి చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి బయటకు వచ్చిన టీజర్ జనాలలో ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది.  

కేజిఎఫ్ చాప్టర్ టు ఇంకా విడుదల కాక ముందే ప్రశాంత్ నీల్ వరస పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెడుతూ ముందుకు దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, ప్రభాస్ హీరోగా, సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నడు. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా  తెరకెక్కే ఒక సినిమా కు కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇలా ఇప్పటికే ఇద్దరు తెలుగు హీరో లను లైన్ లో పెట్టిన ప్రశాంత్ నీల్ తాజాగా మరో తెలుగు స్టార్ హీరో అయిన రామ్ చరణ్ తో కూడా సినిమా చేయబోతున్నట్లు ప్రకటించేశాడు. ప్రశాంత్ నీల్, ప్రభాస్ తో సలార్ సినిమా తర్వాత మరొక సినిమాకు కూడా దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా వరుసగా తెలుగు టాప్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఇండియా లోనే మోస్ట్ క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: