ఈ యాంకర్ దూరం అవడానికి గల కారణాలు ఇవే..?

Divya
యాంకర్ ఉదయభాను.. ఈ పేరు తెలియని వారంటూ ఈ తెలుగు రాష్ట్రాలలో ఎవరు ఉండరు. నా మాటలతో, తను వేసే డైలాగులతో స్టార్ యాంకర్ గా వెలుగొందింది ఉదయభాను. అప్పట్లోనే యాంకర్ సుమ, శిల్ప, ఝాన్సీ వీరంతా యాంకర్ గా ఉంటున్న సమయంలోనే ఈమె కూడా బుల్లితెరపై తన హవాను కొనసాగిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒకానొక సమయంలో.. యాంకర్ల లోనే అత్యధిక రెమ్యూనరేషన్ పుచ్చుకున్న యాంకర్ గా పేరు పొందింది.

మొట్టమొదటిసారిగా హృదయాంజలి అనే ప్రోగ్రాం ద్వారా 15 సంవత్సరాల లోనే వ్యాఖ్యాతగా బుల్లితెరపై అడుగుపెట్టింది. కానీ అప్పటికి వీరి కుటుంబం చాలా ఆర్థిక కష్టాలతో ఉండేదట. ఆ తరువాత ఎన్నో వరుసపెట్టి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల తనకంటూ ఒక ఇమేజ్ ని సృష్టించింది యాంకర్ ఉదయభాను. ఇక అంతే కాకుండా తన మార్కును ఎర్రసైన్యం, లీడర్ వంటి సినిమాల్లో కూడా నటించి చూపించి ఉంది.

ఇలాంటి యాంకర్ ఒక్కసారిగా వెండితెరకు, బుల్లి తెరకు దూరం కావడంతో ఎన్నో గాసిప్స్ పలురకాలుగా పుట్టుకొచ్చాయి. ఈ యాంకర్ ఎవరితోనో ఎఫైర్ పెట్టుకొని, ఎవరికీ తెలియకుండా మ్యారేజ్ చేసుకొని సీక్రెట్ గా ఉంటుందని వార్తలు ఎక్కువగా వినిపించాయి. కానీ వాస్తవానికి ఆమె సిని పరిశ్రమ కు దూరం కావడానికి వేరే కారణాలు ఉన్నాయి అన్నట్లుగా సమాచారం ఉన్నది.
ఉదయభాను వివాహమైన తర్వాత.. తనకి 10 సంవత్సరాల తరువాత ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. ఇక వారితోనే ఆమె కాలక్షేపం బాగా జరుగుతూ ఉండడంతో.. ఇక వేరే ప్రపంచం లోకి రాకుండా జీవిస్తున్న అన్నట్లుగా సమాచారం. అందుచేతనే ఆమె బుల్లితెర, వెండితెరకు దూరమైనట్లు గా సమాచారం. ఒకవేళ ఈమె ఇద్దరు పిల్లలు పెద్దవారు అయితే.. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో తిరిగి వస్తాను అనే ఆలోచనలో ఉన్నట్లుగా కొంతమంది ఆమె సన్నిహితులు తెలియజేస్తున్నారు. బుల్లి తెరకు దూరం కావడానికి ఇదే కారణం అన్నట్లుగా సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: