మరో పాన్ ఇండియా మూవీ లో రానా..!

Pulgam Srinivas
దగ్గుబాటి రానా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో ఒక క్లాస్ పొలిటికల్ లీడర్ లా కనిపించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఈ సినిమా థియేటర్ లలో పెద్దగా ప్రభావం చూపక పోయినప్పటికీ, బుల్లి తెరపై మాత్రం  ఈ సినిమా మంచి గుర్తింపు ను తెచ్చుకుంది. ఇలా లీడర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా, ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలలో హీరోగా నటించినప్పటి ఆ సినిమాలు రానా కు ఆశించిన విజయాలను బాక్సాఫీస్ వద్ద తెచ్చి పెట్టలేదు. ఇలాంటి తరుణం లోనే ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించి తన క్రేజ్ ను రానా పాన్ ఇండియా రేంజ్ లో పెంచుకున్నాడు. ఇలా హీరోగా, ప్రతినాయకుడిగా నటించి మెప్పించిన రానా ఆ తర్వాత టాక్  షో లకు హోస్ట్ గా వ్యవహరించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించాడు.

 అయితే తాజాగా రానా, వెంకటేష్ తో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా రెడీ అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రానా మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనున్ కోషియన్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రానా తో పాటు పవన్ కళ్యాణ్ కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే రానా మరొక సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. దసరా  సందర్భంగా రానా కు సంబంధించిన కొత్త మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. బాలీవుడ్ దర్శకుడు మిలింద్ రావ్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా మూవీ ని చేసేందుకు రానా సిద్ధం అయ్యాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: