రామ్ చరణ్ తో సినిమాను కన్ఫామ్ చేసిన ప్రశాంత్ నీల్..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాను దాదాపుగా పూర్తి చేశాడు. ఈ సినిమా తరువాత కొలీవుడ్ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడు, ఈ సినిమా షూటింగ్ కూడా మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన బోతున్నారు. ఇలా రెండు పాన్ ఇండియా సినిమాలు లను ఇప్పటికే లైన్ లో పెట్టిన రామ్ చరణ్ తాజాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమాలో నటించబోతున్నట్లు ఈ రోజు దసరా సందర్భంగా తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.

 ఇలా ఈ వార్త బయటకు రావడం తోనే రామ్ చరణ్ మరో పాన్ ఇండియా సినిమాను లైన్ లో పెట్టాడు అని కొంత మంది అభిప్రాయపడ్డారు. ఇలా ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి ఎంతో సమయం కాక ముందే రామ్ చరణ్ మరో అదిరిపోయే న్యూస్ ను తన అభిమానులకు తెలియజేశాడు. తాజాగా రామ్ చరణ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కేజిఎఫ్ సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ మరియు చిరంజీవి తో కలిసి ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. అలాగే రామ్ చరణ్, డి.వి.వి.దానయ్య, ప్రశాంత్ నీల్ తో  కలిసి ఉన్న మరొక ఫోటో ను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఇలా వరుసగా రామ్ చరణ్ దర్శకుడు, మరియు ప్రొడ్యూసర్ తో దిగిన ఫోటోలను ఒక దాని తర్వాత ఒకటి పోస్ట్ చేయడంతో ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్ సినిమా కన్ఫామ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: