మెగా క్యాంప్ లోకి అడుగుపెడుతూనే జోష్ నింపిన బాలయ్య!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో చిన్న అసంతృప్తి సినిమా అభిమానులలో ఉంది. అదే ఓ ఇద్దరు అగ్ర హీరోల మధ్య బేదాభిప్రాయాలు ఉన్నాయనే ప్రచారం జరగడం. నిప్పు లేనిదే పొగ రాదు కాబట్టి వారి ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయి అందుకే వారు నేరుగా కాకపోయినా పరోక్షంగా విమర్శించు కుంటూ ఉంటారని, ఎడమొహం పెడమొహం పెట్టుకుంటారని ఇన్ని రోజులు ఇండస్ట్రీలో వాదనలు వినిపించాయి. దాంతో ఇరు హీరోల అభిమానుల మధ్య ఎన్నో వాగ్వాదాలు మరెన్నో ఘర్షణలు జరిగాయి.

ఈ పాటికే ఆ ఇద్దరు హీరోలు ఎవరు అనేది మీ అందరికీ అర్థం అయిపోయి ఉంటుంది. ఒకరు స్వయం కృషితో సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ స్థానాన్ని అందుకున్న హీరో అయితే మరొకరు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు వారసుడిగా సినిమా పరిశ్రమలోకి వచ్చి పెద్ద హీరోగా ఎదిగిన నటుడు. ఇద్దరు కూడా ఎవరి స్థాయిలో వారు ప్రేక్షకులను అలరిస్తు భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. వారే మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ. 

అయితే తాజాగా తమ మధ్య స్నేహం బాగానే ఉందని, ఐడియాలజీ వేరైనా సినిమా పరంగా తాము ఒక్కటే అని నిరూపించాడు నందమూరి బాలకృష్ణ. మెగా క్యాంప్ లో అడుగుపెట్టి మెగా కుటుంబాన్ని ప్రశంసించడం బహుశా ఇండస్ట్రీలోనే తొలి సారి కావచ్చు. ఆహా లో ఓ టాక్ షోలో చేయబోతున్నాడు బాలకృష్ణ. ఈ కార్యక్రమం ప్రమోషన్ సందర్భంగా ఈవెంట ఏర్పాటు చేయగా ఆ ఈవెంట్లో అల్లు అరవింద్ ను పొగుడుతూ మాట్లాడి బాలకృష్ణ గతంలో ఎన్నడూ లేని విధంగా మెగా అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ విధంగా మెగా క్యాంపు లో అడుగు పెడుతూనే నందమూరి బాలకృష్ణ మెగా అభిమానుల లో జోష్ నింపుతూ వారి అభిమానాన్ని కూడా పొందాడు. మరి ముందు ముందు ఎలాంటి సంచలనాలను సృస్తిస్తాడో ఈ షో ద్వారా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: