రవితేజ ఆ డైరెక్టర్ తో గొడవ పడడానికి కారణం..?

Divya
టాలీవుడ్ లో 53 సంవత్సరాలు వచ్చినప్పటికీ హీరోగానే నటిస్తున్నాడు మాస్ మహారాజారవితేజ. ఇక అప్పట్లో సాదాసీదా గా కనిపించే రవితేజ.. లైట్ మేన్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి ఆ తర్వాత తన సినీ కెరీర్ ని మొదలు పెట్టాడు. 1990 సంవత్సరం లో కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేస్తు వచ్చాడు రవితేజ. అయితే రవితేజ ఒక డైరెక్టర్ తో గొడవ పడ్డాడట దాని గల కారణం ఏంటో చూద్దాం.
కృష్ణవంశీ రవితేజ కాంబినేషన్లో వచ్చిన చిత్రం సింధూరం. ఈ సినిమాలో రవితేజ చంటి అనే పాత్రలో నటించాడు. ఈ సినిమాతో పాటు నాగార్జున నటించిన  నిన్నే పెళ్ళాడుతా సినిమా లో కూడా రవితేజకు అవకాశం ఇచ్చాడు కృష్ణ వంశీ డైరెక్టర్. ఇక ఆ తర్వాత వీరి కాంబినేషన్లో ఎన్నో చిత్రాలు కూడా వచ్చాయి. సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంత మంది డైరెక్టర్లు రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
అందులో ముఖ్యంగా కృష్ణవంశీ,పూరి జగన్నాథ్,రవితేజ కూడా పనిచేశారు. దాంతో వీరు ముగ్గురు మధ్య మంచి స్నేహం ఉండేది. ఇక ఇప్పటికీ పూరి జగన్నాథ్ రవితేజ స్నేహంగానే ఉంటున్నారు. కానీ రవితేజ-కృష్ణవంశీ మాత్రం ఇప్పటికి మాట్లాడుకోలేదట..! ఆ విషయాన్ని..నిన్నే పెళ్ళాడుతా సినిమా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ.ఆ సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కృష్ణవంశీ కొన్ని విషయాలను తెలియజేశాడు.
నిన్నే పెళ్ళాడుతా సినిమా గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. యాంకర్ రవితేజ గురించి కృష్ణవంశీని ఒక ప్రశ్న అడగగా.. కానీ కృష్ణవంశీ మాత్రం రవితేజ గురించి మాట్లాడటం ఇష్టం లేదు.. వేరే క్వశ్చన్  అంటూ దాటేశాడు. అయితే వీరిద్దరు ఏ విషయంలో మనస్పర్ధలు వెలుబడ్డాయి అనే విషయం ఇప్పుడు ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది.మరి విషయం పై ఎవరు స్పందిస్తారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: