కళా 'మా' తల్లి : మా లో ఆ సత్తా ఆయనకే ఉంది ..శ్రీ రెడ్డి !!

Surya
మూవీ ఆర్టిస్ట్ అస్సోసియేషన్ ఎన్నికలకు ముందు తరువాత పలు మార్పులు చోటుచేకున్నాయి. మంచు విష్ణు గెలిచి అధికార ఫీఠాన్ని దక్కించుకుంటే. ప్రకాష్ రాజ్ ప్యానల్ మా సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఇరు ప్యానళ్ల మధ్య పరస్పర నిందారోపణలు జరుగుతున్నాయి. విష్ణు ప్యానల్ నుండి మాజీ అధ్యక్షుడు నరేష్ ప్రకాష్ రాజ్ ప్యానల్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు కూడా . జరుగుతున్న మొత్తం సీన్ గమనిస్తున్న శ్రీ రెడ్డి తనకొక అవకాశం వచ్చినట్లు గా భావించి సోషల్ మీడియా ముఖంగా సెటైర్లు విసురుతోంది. ఆమె మాట్లాడుతూ ' నేను మా ముందు ఆందోళన చేసినప్పుడు మా లో పెద్దమనిషి అనిపించుకున్న ఏఒక్కరు నాకు మద్దతు తెలుపలేదు, నా కన్నీరు తుడవ లేదు. కానీ ప్రస్తుతం అందరు రోడ్లపైకి వచ్చి గుక్క పెట్టి ఏడుస్తున్నారు, అస్సోసియేషన్ కు సేవ చేస్తామంటున్నారు, ఎవరు సేవలు చేస్తే ఏమిటి , ఈ ఏడుపులు పెడబొబ్బలు ఎందుకు ' అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతూ ప్రశ్నిస్తోంది.




పవన్ కళ్యాణ్ , చిరంజీవి , నాగబాబు వేసిన ఎత్తులు ఈ సారి పారలేదని, ఇకపోతే ఏళ్ళ తరబడి కొనసాగుతున్న వారి ఆధిపత్యం పోయినందుకు ప్రస్తుతం ఏడుస్తున్నారు అంటూ కామెంట్స్ చేసింది. ఒకప్పుడు నేను మా పరువు తీసాను అంటూ హేమ , నాగబాబు , జీవిత ఇలా అందరూ నన్ను అవమానించి ఏడిపించారు ఇప్పుడు ఆ పెద్దలే మా పరువుని రోడ్డుపైకి తెచ్చి గంగ పలు చేస్తున్నారు అంటూ విమర్శలు చేసింది . అస్సోసియేషన్ లో ఇప్పుడు విష్ణు- ప్రకాష్ రాజ్ ప్యానల్ గొడవ కాస్త కమ్మ -కాపు గొడవగా మారిందని కుండ బద్దలు కొట్టింది. దాసరి నారాయణ రావు తరవాత అంతటి గొప్ప నాయకత్వ లక్షణాలున్న మోహన్ బాబు గారు మాత్రమే ఆ స్థానాన్ని భర్తీ చేయగలరని శ్రీరెడ్డి చెప్పింది . దింతో మోహన్ బాబు ని ఇప్పటి నుండే కాకాపడుతోందని నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. మరి ప్రకాష్ రాజ్ ప్యానల్ ఈ విషయమై ఎలా స్పందిస్తారో చూడాలి మరి   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: