'రాత్రి గెలిచాం.. ఉదయం ఒడిపోయాం.. ఏం జరిగిందో అమ్మకే తెలియాలి' : హేమ

Anilkumar
మా ఎన్నికల ఫలితాలపై రోజు రోజుకి ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.ఇక తాజాగా ఇదే విషయమై ప్రముఖ నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు.మా ఎన్నికల్లో ఏదో జరిగిందని హేమ ఆరోపణ చేసింది.రాత్రికి గెలిచాం.. పొద్దున గఒడిపోయాం.. అది ఎలాగో తెలీదు.అమ్మవారికి అయినా తెలుసో లేదో అంటూ మా ఎన్నికల ఫలితాలపై ఓ డౌట్ ని క్రియేట్ చేసి వదిలేసింది హేమ.తాజాగా విజయవాడ ఇంద్ర కీలాద్రి పై దుర్గమ్మను దర్శించుకున్నారు హేమ.అనంతరం కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు.మా ఎన్నికలపై అనుమానాలు మొదటి నుంచీ ఉన్నా..అమ్మవారి సాక్షిగా హేమ బయటపెట్టేసింది.

ఒక్క హేమనే కాదు..గతంలో అనసూయ కూడా ఇలాగే ట్వీట్ చేసింది.ట్వీట్ తో అనుమానాలు రెయిజ్ చేసిన అనసూయ..ఆ తర్వాత తన మనసులో మాట బయట పెట్టింది.ఇక ఇటీవల జరిగిన మా ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి.ఇక వివాదాలు కూడా అంతకుమించేలా చెలరేగాయి.ఫైనల్ గా ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వచ్చాయి.అయినా కూడా రోజుకో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.నిజంగా అనసూయ, హేమ ఆరోపించినట్టు కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయా?అలా కాకుంటే రాత్రికి గెలిచిన అభ్యర్థులు మరుసటి రోజు పొద్దున్నే ఎందుకు ఒడిపోతారు.

ఇప్పుడు ఇదే ఓ మిస్టరీగా మారింది.నిజానికి అందరి సమక్షంలోనే కౌంటింగ్ జరిగింది.ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చాక గెలిచిన సభ్యులు సంబరాలు కూడా చేసుకున్నారు.అంతా బాగానే ఉంది.అయితే ఇంతకీ ఆ రోజు రాత్రి ఏం జరిగినట్లు?అధికారికంగా ఫలితాలు ప్రకటించకుండా మరుసటి రోజుకు ఎందుకు పోస్ట్ పోన్ చేశారు?బ్యాలెట్ బాక్సులు ఏమైనా ఇంటికి తీసుకెళ్లారా?అక్కడే సీన్ రివర్స్ అయ్యిందా?ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే ఇప్పుడు తాజాగా హేమ ఈ ఎన్నికల ఫలితాలపై చేసిన ఆరోపణలతో ఈ అనుమానాలు ఇంకా రెట్టింపు అయ్యాయనే చెప్పాలి.అయితే ఈ ప్రశ్నలు,అనుమానాలకు ఎవరు పులిస్టాప్ పెడతారనే చర్చ ఫిల్మ్ నగర్ లో జోరుగా నడుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: