టాలీవుడ్ లో మరో విషాదం.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమను గత కొంత కాలం నుంచి వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోతుంది. ఇక ఇటీవల సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీ ఆర్ పిఆర్వో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ అయిన మహేష్ కోనేరు ఇటీవలే గుండెపోటుతో హఠాత్ మరణం చెందారు. మహేష్ కోనేరు మరణం ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమను మొత్తం విషాదంలోకి నెట్టింది. ఈరోజు ఉదయం విశాఖపట్నం లోని ఆయన నివాసంలో మహేష్ కోనేరు చాతి నొప్పితో బాధపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

 కాగా ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహేష్ కోనేరు తుదిశ్వాస విడిచారు.ఇక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల నుంచి జూనియర్ ఎన్టీఆర్ మేనేజర్గా పనిచేస్తున్నారు మహేష్ కోనేరు. అంతేకాదు ఇటీవల ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అనే ఒక నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు. కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా పనిచేశారు మహేష్ కోనేరు. ఇక ఆయన బ్యానర్ మీద 118, తిమ్మరసు, మిస్ ఇండియా సినిమాలను నిర్మించారు మహేష్ కోనేరు. విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు.  ఇక రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతమైన సినిమాలు తెరకెక్కించడానికి ప్లాన్ చేసుకుంటున్న తరుణంలో ఇలా హఠాత్ మరణం చెందడం మాత్రం అందరినీ ఎంతగానో కలచివేస్తుంది

 అయితే ఎన్నో రోజులనుంచి జూనియర్ ఎన్టీఆర్కు మహేష్ కోనేరు మేనేజర్ గా పని చేస్తుండగా మహేష్ కోనేరు హఠాత్ మరణం పై ఒక్కసారిగా షాక్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. మహేష్ కోనేరు ఆత్మకు శాంతి కలగాలి అంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది. బరువెక్కిన హృదయంతో చెబుతున్న నా మిత్రుడు మహేష్ కోనేరు ఇక లేరు నాకు మాటలు రావడం లేదు. మహేష్ కోనేరు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా లో ఒకటి పెట్టారు ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా మహేష్ కోనేరు కు నివాళులు అర్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: