ఒక్కొక్క‌రిని కాదు షేర్ ఖాన్ అంటు దుమ్ము లేపిన రామ్ చ‌ర‌ణ్‌

Dabbeda Mohan Babu
మెగస్టార్ చిరంజివి త‌న‌యుడుగా తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోకి పెట్టిన రామ్ చ‌ర‌ణ్ పెట్టాడు. త‌న మొద‌టి సినిమా చిరుత సినిమా తో టాలీవుడ్ లో అరంగేట్రం చేశాడు. రెండో సినిమా గా మ‌గ‌ధీర తీశాడు. ఈ సినిమా తో రామ్ చ‌ర‌ణ్ స్టార్ ఇమెజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా లో రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న‌తో పాటు త‌న డైలాగ్స్ కూడా చాలా పాపుల‌ర్ అయ్యాయి. రెండో సినిమా తోనే అగ్ర హీరోల‌తో పోటీ ప‌డుతున్నాడు. దీనికి కార‌ణం ఈ సినిమా అనే చెప్పాలి. ఈ సినిమా లో ఉన్న డైలాగ్స్ ఇప్ప‌టికీ టాప్ డైలాగ్ లీస్ట్ లో ఉంటాయి. ఇప్పటికి కొన్ని సినిమాలో ఈ డైలాగ్స్ ను వాడుతు ఉంటారు. కాగ ఈ సినిమా ను టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌ ఎస్ ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కానీ ఈ సినిమా క‌థ ను కెవీ విజ‌యేంద్ర ప్ర‌సాద్ రాసాడు. ఈ సినిమా క‌థ తో పాటు డైలాగ్స్ కు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు.

మ‌గ‌ధీర సినిమా లో రామ్ చ‌ర‌ణ్ కాల భైర‌వ పాత్ర లో న‌టిస్తాడు. అలాగే రియ‌ల్ యాక్ష‌న్ హీరో శ్రీ హ‌రి షేర్ ఖాన్ పాత్ర ను పోషిస్తాడు. సినిమా లో ఒక సంద‌ర్భంలో వీరి మ‌ధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. వీరి మ‌ధ్య లో జరిగిన డైలాగ్స్ ల‌లో రామ్ చ‌ర‌ణ్ డైలాగ్స్ చాలా ఫేమ‌స్ అయింది. రామ్ చ‌ర‌ణ్ చెప్పే డైలాగ్స్ ఇలా ఉంటాయి. వెన్ను చూప‌ని వీరుల‌ను ఎంచుకుని పంపు షేర్ ఖాన్‌.. లెక్క ఎక్కువ అయినా ప‌ర్లేదు.. త‌క్కువ కాకుండా చూసుకో.. ఒక్కోక్క‌రిని కాదు షేర్ ఖాన్ వంద మంది ని ఒకే సారి పంపించు అంటూ రామ్  చ‌ర‌ణ్ చెప్పే డైలాగ్స్ చాలా ఫేమ‌స్. సినిమా విడుద‌ల అయిన నాటి నుంచి ఇప్ప‌టి వర‌కు ఈ డైలాగ్ క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. అలాగే రామ్ చ‌ర‌ణ్ ఈ డైలాగ్ డెల‌వ‌రీ కూడా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈ డైలాగ్ ఇన్ని సంవ‌త్స‌రాలు అయినా క్రేజ్ ఎమాత్రం త‌గ్గ‌లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: