బ్రేకింగ్‌: మా ఎన్నిక‌ల్లో ఓటేయ‌డానికి ముంబై నుంచి వ‌చ్చిన హీరోయిన్‌

VUYYURU SUBHASH
తెలుగు మూవీ అర్టిస్ట్ అసోసియేస‌న్ (  మా   ) ఎన్నిక‌లు ఈ రోజు ఉద‌యం జ‌రుగుతున్నాయి. ఫిల్మ్ న‌గ‌ర్ ప‌రిధిలో ఉన్న జూబ్లి హిల్స్ ప‌బ్లిక్ స్కూల్లో ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల కు పోలింగ్ ప్రారంభ‌మైంది. ఇక ఓటు వేసేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు రావ‌డం కూడా ఆస‌క్తి గా మారింది. ఉద‌యం 11 గంట‌ల‌కు దాదాపు 300 ఓట్లు పోల్ అయిన‌ట్టు ఎన్నిక‌ల అధికారులు చెపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నిక‌ల లో ఓటు వేసేందుకు ప‌లువురు మాజీ హీరోయిన్లు, సీనియ‌ర్ హీరోయిన్ల కూడా వ‌చ్చారు.
సీనియ‌ర్ న‌టి రోజా ఓటే య‌డంతో పాటు ఏ ఫ్యానెల్ గెలిచినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వా ల‌తో మాట్లాడి సినిమా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పాటు ప‌డాల‌ని సూచించారు. ఇక మ‌రో హీరోయిన్ జెనీలియా ముంబై నుంచి మ‌రీ ఓటేసేందుకు వ‌చ్చారు. ఆమె ఎన్నిక‌ల ప్రాంగ‌ణంలోకి వ‌చ్చిన వెంట‌నే మంచు విష్ణు ఓ రేంజ్ లో ఆమెను రిసీవ్ చేసుకుని కేంద్రంలోకి తీసుకు వ‌చ్చారు.
ఇక ఓటు వేసిన వెంట‌నే జెనీలియా మీడియా తో మాట్లాడారు. తెలుగు పుట్టిల్లు లాంటిది... నా బెస్ట్ ఫ్రెండ్ విష్ణు అని చెప్పారు. వీరిద్ద‌రు క‌లిసి 2007లో శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వం లో వ‌చ్చిన ఢీ సినిమాలో న‌టించారు. ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. చాలా రోజుల త‌ర్వాత విష్ణు కెరీర్ లో ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో న‌టించిన విష్ణు, జెనీలియా అప్ప‌టి నుంచి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటూ వ‌స్తున్నారు. ఇక ఈ రోజు కూడా జెనీలియా విష్ణు ఆహ్వానం మేర‌కే ముంబై నుంచి వ‌చ్చి మ‌రీ ఓటేసింది. ఇక జెనీలియా వివాహం అనంత‌రం ముంబై లోనే త‌న ఫ్యామిలీ తో నివాసం ఉంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: