బ్రేకింగ్‌: శివ‌బాలాజీ చేయి కొరికిన హేమ‌

VUYYURU SUBHASH
మా ఎన్నిక‌లు తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితుల మ‌ధ్య కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే మా లో ఉన్న స‌భ్యుల్లో 250 ఓట్లు పోలైన‌ట్టు ఎన్నిక‌ల అధికారులు చెపుతున్నారు. ఇక ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభ మైన వెంట‌నే కొద్ది సేపు ఎన్నిక‌లు స‌రైన వాతావ‌ర‌ణం లో జ‌రిగినా .. ఆ త‌ర్వాత మాత్రం పెద్ద యుద్ధ‌మే జ‌రుగుతోంది. మోహ‌న్ బాబు బ‌య‌ట వ్య‌క్తులు లోప‌ల‌కు వ‌స్తున్నార‌ని గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో ప్ర‌కాష్ రాజ్ ఫ్యానెల్ కు చెందిన స‌మీర్ ఎన్నిక‌ల అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నిక‌ల అధికారులు మోమ‌న్‌బాబుకు వార్నింగ్ లు ఇచ్చారు.
ఇక ప్ర‌కాష్ రాజ్ ఫ్యానెల్లో కీల‌కంగా ఉన్న హేమ కు , ఇటు విష్ణు ఫ్యానెల్లో ఉన్న శివ‌బాలాజీ కి మ‌ధ్య చిన్న గొడ‌వ జ‌రిగింద‌ట‌. ఈ గొడ‌వ పెద్ద‌ది కావ‌డంతో హేమ శివ‌బాలాజీ చేయిని గ‌ట్టిగా కొరికేసింద‌ని న‌రేష్ చెప్పారు. ఇక ముందు నుంచి కూడా హేమ ప్ర‌ధానంగా న‌రేష్ ను టార్గెట్ గా చేసుకుని తీవ్ర ఆరోప‌న‌లు చేస్తూ వ‌స్తున్నారు.
ఇక మా ఎన్నిక‌ల లో సీనియ‌ర్ న‌టి, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా ఓటు హ‌క్కు వినియోగించు కున్నారు. మాలో ఉంది మొత్తం 900 మంది స‌భ్యులు మాత్ర‌మే అని.. ఇరు ప‌క్షాలు కూడా మా అభివృద్ధికి కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. రెండు ఫ్యానెల్స్ లోనూ త‌న‌తో పాటు క‌లిసి ప‌ని చేసిన న‌టులు ఉన్నార‌ని ఆమె గుర్తు చేశారు. ఇక్క‌డ ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల తో మాట్లాడి సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధికి చ‌ర్య‌లు తీసు కోవాల‌ని ఆమె కోరారు.
ప్ర‌తి ఒక్క‌రు కూడా విద్వేష రాజ‌కీయాలు ఆపాల‌ని.. ప‌క్క నుంచి మాట్లాడే వారి వ‌ల్లే అస‌లు గొడ‌వ‌లు వ‌స్తున్నాయ‌ని కూడా ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: