'మా' ఎన్నికల్లో రోజా ఓటు అతనికేనా..?

Anilkumar
సినీ పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి.అక్టోబర్ 10 న జరిగే ఈ ఎన్నికల్లో ఇరు వర్గాల సభ్యులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ప్రముఖ సీనియర్ నటి నగరి ఎమ్మెల్యే రోజా మా ఎన్నికలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.ఇప్పటికే రోజా వైసీపీ ఎమ్మెల్యే గా నగరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు.సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె..ప్రస్తుతం బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో జడ్జి గా వ్యవహరిస్తోంది.అయితే తాజాగా 'మా' ఎన్నికల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలో పాల్గొని ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకుంటానని ఆమె చెప్పుకొచ్చింది.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను, అసోసియేషన్ లోని సభ్యులను అభివృద్ధి చేసే ప్రణాళికలను కలిగి ఉన్న మేనిఫెస్టోలోని సభ్యులకు మాత్రమే ఓటు వేస్తానని రోజా వెల్లడించారు.ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికే తన ఓటు అని కామెంట్స్ చేయడం గమనార్హం.లోకల్, నాన్ లోకల్ విషయం గురించి ప్రశ్నలు ఎదురు కాగా వివాదాస్పద ప్రశ్నలు అడగవద్దని రోజా అన్నారు.రాజకీయ ఎన్నికలతో పోలిస్తే 'మా' ఎన్నికలు వాడి వేడిగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో వేలు పెట్టాలని అనుకోవడం లేదని రోజా చెప్పుకొచ్చారు.

అయితే పోటీ చేస్తున్న వారిలో విష్ణు సీఎం జగన్ కి సన్నిహితుడు కావడంతో అతనికే రోజా ఓటు వేస్తారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.అయితే రోజా మాత్రం నోరు విప్పి చెప్పకపోవడంతో ఆమె ప్రకాష్ రాజ్ కు ఓటు వేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ఎక్కువ మంది సెలెబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి.అందుకు ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ఇండ్రస్టీ లోనే చర్చనీయాంశంగా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: