బాధ తెలిసిన వాడే బాధ పెడుతున్నాడు?

Purushottham Vinay

బాధ, దుఃఖం ఈ రెండూ తెలుసు..అనుభ‌వించిన వాడు అత‌డు..అలాంటి చోటు నుంచి పెరిగి వ‌చ్చిన వాడు అత‌డు.. ఇప్పుడెం దుకు తాను ప్రేమించిన, ప్రాణం అని న‌మ్మిన భార్య (స‌మంత‌)ని అదే బాధ‌కు గురి చేస్తున్నాడు? కొన్నే ప్ర‌శ్న‌లు ? కొన్నే మ‌జిలీ లు..? అసంపూర్తిగా ఉండిపోతాయి.. అందుకు తార్కాణం ఈ జంట క‌థ‌! దేవుడు  ధైర్యం ఇవ్వాల‌ని వేడుకోవ‌డం కాదు త‌ల్లిదండ్రు లే ఈ స‌మాయాన అండ‌దండ‌లివ్వాలి...ఇరువురికీ! ప్ర‌పంచంలో గెలిచిన‌ ప్రేమ‌కు, ఓడిన ప్రేమ‌కు మ‌ధ్య ఓ చిన్న గీత ఈ క‌థ!
త‌ల్లీ,తండ్రీ ఒకే చోట ఉంటే ఏ బిడ్డ‌కు అయినా ఆనందం. ఒకే చోట ఉంటూ త‌మ నీడ‌లో బిడ్డ‌ల‌ను ఎద‌గ‌నివ్వ‌డం ఓ బాధ్య‌త.. త‌ల్లీ, తండ్రీ వేరుగా ఉంటే బిడ్డ‌ల‌కు దుఃఖం. వారికి తెలిసిన ప్ర‌పంచం చీక‌టి అవుతుంది. వారికి తెలియ‌ని ఆనందం ఎన్నడో,ఎక్క‌డో ఆ గిపోయి ఉంటుంది. త‌ల్లీ,తండ్రీ ఓ గూటి ప‌క్షుల్లా ఉంటూ బిడ్డ‌ల‌కు రెక్క‌లు వ‌చ్చే వ‌ర‌కూ ఆగాలి. సాకాలి. త‌ల్లీ,తండ్రీ ..గురువూ దై వం అయి మున్ముందుకు న‌డ‌పాలి. ఇవ‌న్నీ ఆ కుర్రాడి జీవితంలో లేవు. ఆ మాట‌కు వ‌స్తే ఆ కుర్రాడికి ప‌సి వ‌య‌స్సులోనే తెలి య‌ని ఒంట‌రిత‌నం క‌మ్మేసింది.
వీటి నుంచి దూరం అయ్యాడు కొంత కాలం..ఆ కుర్రాడు...ఆ కుర్రాడి పేరు అక్కినేని నాగ చైత‌న్య.. నాగార్జున తొలి భార్య (ల‌క్ష్మి, హీరో వెంక‌టేశ్ సోద‌రి) కొడుకు..రామానాయుడు మ‌న‌వ‌డు..అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వడు.. ఇంత‌మంది ఉన్నా అతడు ఒం ట‌రే. చిన్న నాట ఒంట‌రే! అమ్మానాన్న‌ల విడాకుల‌తో ఒంట‌రే! అప్పుడు సింగిల్ పేరెంటింగ్ నీడ‌లో ఉన్నాడు. అమ్మ దగ్గ‌ర ఉంటూ ఊహ తెలియ‌ని రోజు నుంచి తెలిసిన రోజు వ‌ర‌కూ ఎంతో ఒదిగాడు. ఇలాంటి స‌మ‌యాన స‌మంత రాకతో  చైత‌న్య జీవిత‌మే మారి పోయింది. చిన్నప్పుడు ఏ కారణాల వల్ల చైతూ బాధ పడ్డాడో ఇప్పుడు కూడా అదే పరిస్థితి మళ్లీ జీవితంలో చవి చూడాల్సి వస్తోం ది. మ‌ళ్లీ నాటి క‌థ మొద‌టికి వ‌చ్చింది. పున‌రావృతం అయింది. త‌ను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆనందం ప‌ట్టుమ ని మూడేళ్లు కూడా లేకుండాపోయింది. ఏడేళ్ల ప్రేమ, మూడేళ్ల వైవాహిక బంధం అన్నీ అన్నీ ఒక్క నిర్ణ‌యంతో తెగిపోయాయి. ముగిసిపోయాయి.
వాస్త‌వానికి తండ్రి నాగార్జున తల్లి లక్ష్మి దంప‌తులు నాగ చైతన్య పుట్టిన కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ ద‌గ్గు బాటి, అక్కినేని కుటుంబాలు కూడా చైతన్యను అక్కున చేర్చుకున్నారు. అతని తల్లి లక్ష్మి అమెరికా వెళ్లి పోవడంతో కొన్నాళ్లు అ క్కడకు వెళ్లిన చైతూ,తిరిగి వ‌చ్చాక హైద్రాబాద్ లోనే ఉండిపోయాడు. చిన్న‌నాట త‌ల్లీ, తండ్రీ క‌లిసి లేక‌పో వ‌డంతో చైతూ పూర్తిగా మాన‌సిక వేద‌న‌కు గుర‌య్యాడు.ఇక ఆ ఇబ్బంది మళ్లీ చైతూకు ఉండవద్దని అందరు ఆశించారు కూడా. కానీ  చైతన్య..సమంత నుండి విడిపోవడం వల్ల మళ్లీ అదే ఫీలింగ్ అతడికి తప్పలేదు అంటూ నాగ చైత‌న్య అభిమానులు బాధ‌ప‌డుతున్నారు. ఒక‌నాటి బాధ‌, క‌న్నీళ్లు తెలిసిన  చైతూ ఇప్పుడు సమంతనూ అదే స్థాయిలో ఇబ్బంది పెడుతున్నాడ‌ని ఇంకొంద‌రు ఆమె త‌ర‌ఫున త‌మ వాద‌న వినిపిస్తున్నారు. ఆవేద‌న చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: