బాలయ్య ఇప్పుడు కిం కర్తవ్యం.. టెన్షన్ లో ఫ్యాన్స్!!

P.Nishanth Kumar
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అఖండ చిత్రం షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. దసరా కి కానీ దీపావళి కి కానీ ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ మసాలా చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ట్లు తెలుస్తుంది.  అయితే ఈ సినిమాకి రౌడీయిజం అనే టైటిల్ ఫిక్స్ చేసింది చిత్రం బృందం అని సోషల్ మీడియాలో వార్తలు దాన్ని కొట్టిపారేసింది  చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.

 ఇటీవలే ప్రచారం అవుతున్న ఈ సినిమా టైటిల్ పై స్పందిస్తూ ఇది తమ సినిమా టైటిల్ కానేకాదని అందరికీ స్పష్టతనిచ్చింది. అయితే ఈ టైటిల్ బాగానే ఉంది కదా ఎందుకు పెట్టుకోకూడదు అని అభిమానులు సలహా ఇస్తున్నారు. మరోవైపు కథకు ఈ టైటిల్ యాప్ట్ కావట్లేదని వారు ఈ టైటిల్ ను పెట్టలేదు అని చెబుతున్నారు. దీంతో బాలయ్య అభిమానులు బాలయ్య కోసం ఎలాంటి పవర్ ఫుల్ టైటిల్ ను తీసుకు వస్తారో అని ఎదురు ఎదురు చూడసాగారు.  అయితే ఈ టైటిల్ ని ఫిక్స్ చేయమని ఇంకొంత మంది కోరుతున్నారు.

ఈ సినిమా తర్వాత కూడా బాలకృష్ణ సినిమాలు చేయడానికి దర్శకులను ఎంచుకుంటున్నాడు. పూరి జగన్నాథ్ అనిల్ రావిపూడి వంటి దర్శకులు లైన్లో పెట్టుకున్నాడు. మరి వరుస గా రెండు మాస్ మసాలా చిత్రాలు చేసిన బాలకృష్ణ ఏ దర్శకుడి తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. అఖండ సినిమా విషయానికి వస్తే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వీరందరికీ తప్పకుండా హిట్ అవ్వాల్సిన సినిమా. ఈ నేపథ్యంలో అఖండ సినిమాతో బాలకృష్ణ ఏ రేంజ్ లో అందుకుంటాడు చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: