కొడుకును మహేష్ అంత నమ్ముతాడా..?

Anilkumar
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్.హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అతడు,ఖలేజా వంటి కమర్షియల్ సినిమాలు వచ్చాయి. మళ్ళీ చాలా కాలం తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ భీమ్లా నాయక్ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని అందిస్తున్నాడు.అటు మహేష్ బాబు కూడా పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట షూటింగ్ తో బిజీగా వున్నాడు.

ఇక వీరి కాంబినేషన్ మూవీ నవంబర్ లో ప్రారంభం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.నవంబర్ లోనే సర్కారు వారి పాట షూటింగ్ ని ఫినిష్ చేయనున్నాడట మహేష్.ఇక అదే నెలలో త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇప్పటికే సినిమాలో మహేష్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారని..వారిలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ని సెకండ్ హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ని ఎంపిక చేసినట్లు సమాచారం.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో మహేష్ బాబు కి ఓ తమ్ముడి క్యారెక్టర్ ఉంటుందట. ఆ పాత్ర కోసం మొదట యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ని మేకర్స్ అనుకున్నారట. కానీ మహేష్ బాబు మాత్రం నిఖిల్ కి బదులు తన కొడుకు గౌతమ్ ని తన సినిమాలో తమ్ముడి రోల్ లో తీసుకునే ఆలోచనలో ఉన్నాడట.తన కొడుకు మీద నమ్మకంతో మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ ఈ విషయాన్ని మేకర్స్ దృష్టికి తీసుకెళ్లి..నిఖిల్ ని వద్దన్నాడని ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ ప్రచారం జరుగుతోంది.మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాలంటే చిత్ర యూనిట్ దీనిపై ఓ క్లారిటీ ఇవ్వాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: