శ్రీకాంత్ మెయిన్ విలన్ గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు నెగెటివ్ రోల్స్ కూడా చేసి వాటిల్లోనూ మంచి నటనను కనబరిచారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి టాప్ స్టార్ కూడా పలు సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేశారు.కథ నచ్చితే విలన్ రోల్స్ లో నటించడానికి కూడా సిద్ధం అవుతున్నారు మన సినీ తారలు.అలాంటి నటుల్లో మన ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కూడా ఉన్నాడు. హీరోగానే కాకుండా అప్పట్లో కొన్ని సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా చేసాడు.అయితే పూర్తి స్థాయి విలన్ గా ఒకే ఒక సినిమాలో నటించాడు శ్రీకాంత్. ఈ విషయం చాలామందికి తెలియదు.ఆ వివరాల్లోకి వెళ్తే.. అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన 'యుద్ధం శరణం' అనే సినిమాలో శ్రీకాంత్ మెయిన్ విలన్ గా నటించాడు.

ఈ సినిమా 2017 లో విడుదలైంది.కానీ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేక డిజాస్టర్ గా నిలిచింది. కృష్ణ మరిముతు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగ చైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది.వారాహి చలన చిత్రం బ్యానర్ పై సుమారు 50 కోట్ల బడ్జెట్ తో రజిని కొర్రపాటి, సాయి కొర్రపాటి ఈ సినిమాని నిర్మించారు. ఇక ఈ సినిమాలో రావు రమేష్, రేవతి కీలక పాత్రల్లో నటించగా.. హీరో శ్రీకాంత్ మెయిన్ విలన్ పాత్రను పోషించారు.రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిచారు.ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ విలన్ గా నటించలేదు శ్రీకాంత్. అయితే మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా..

 నటిస్తున్న'అఖండ' సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు శ్రీకాంత్.ఇప్పటికే అఖండ టీజర్స్ కి భారీ రెస్పాన్స్ రాగా.. కచ్చితంగా ఈ సినిమా తర్వాత విలన్ గా శ్రీకాంత్ కి మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే గతంలో జగపతిబాబు బాబు కూడా 'బోయపాటి డైరెక్ట్ చేసిన లెజెండ్ సినిమతోనే విలన్ గా మారి.. ఆ తర్వాత మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ కూడా 'అఖండ' తర్వాత విలన్ గా బిజీ అవుతాడని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..ఇక ఇన్నాళ్లు హీరోగా మెప్పించిన శ్రీకాంత్..ఇప్పుడు విలన్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: