మీనా తల్లే ఆమెకు శాపంగా మారింది.. ఎందుకో తెలుసా?

praveen
నవయుగం అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ని సంపాదించింది. అయితే మొదట చేసిన సినిమానే అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో మీనా తర్వాత వరుసగా అవకాశాలు అందుకోలేకపోయింది. అయితే మొదట సిరివెన్నెల సినిమాలో బాల నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది మీనా.  ఇక 13 ఏళ్ళకే నవయుగం సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఇక నవయుగం సినిమా తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో ఇక చదువుపై దృష్టి సారించింది మీనా. కానీ అంతలో సీతారామయ్యగారి మనవరాలు అనే సినిమాలో అవకాశం వచ్చింది.

 ఇక ఈ సినిమా అటు మీనా  కెరీర్ను మలుపు తిప్పింది అనే చెప్పాలి. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి.  ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాలి. ఇక ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గానే కొనసాగింది. అయితే ఓ వైపు స్టార్ హీరోయిన్గా కొనసాగినప్పటికీ ఎన్నో హిట్ సినిమాలను వదులుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మీనా కెరీర్ మరో రేంజ్ లో ఉండేది కానీ మీనా సరైన హిట్ సినిమాలు చేయకపోవడానికి తల్లి కారణంగా మారింది అన్నది తెలుస్తుంది.

 ఎందుకంటే మీనా తల్లి పెట్టిన హద్దుల పంజరంలో మాత్రమే బ్రతుకుతూ ఉండేది. ఈ క్రమంలోనే ఏదైనా సినిమా ఓకే చేయాలన్నా తల్లి నిర్ణయమే ఫైనల్ అయింది.  ఈ క్రమంలోనే ఎన్నో హిట్ సినిమాలను వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తల్లి కారణంగా నచ్చిన సినిమాలు కూడా చేయలేకపోయింది. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రను ఇలాగే వదులుకోవాల్సి వచ్చింది. ఈ పాత్ర నచ్చినప్పటికీ తల్లి మాటకు ఎదురు చెప్పలేక సినిమా వదులుకుంది.  నాగార్జున హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న నిన్నే పెళ్లాడుతా సినిమాలో మొదట మీనాని తీసుకోవాలని అనుకున్నారు. దీని కోసం రెండు నెలల షెడ్యూల్ అడుగగా మీనా తల్లి మాత్రం 20 రోజులు ఇస్తాను లేదంటే ఊరుకోండి అంటూ ముఖం మీదే చెప్పడంతో ఇక ఈ సినిమా కూడా మిస్ అయింది. తర్వాత ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇక మీనా ఎంతగానో బాధ పడిందట   ఎన్నోసార్లు హీరోయిన్ మీనా తల్లి కారణంగా ఇబ్బంది పడినట్లు  అప్పట్లో ఎన్నో సార్లు టాక్ వినిపించింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: