ఆ ప్రదేశంలో ఎక్కువ సమయం ఉండలేను అంటున్న రష్మిక మందన..!

Pulgam Srinivas
హాట్ బ్యూటీ రష్మిక మందన కన్నడ సినిమా 'కిరిక్ పార్టీ' తో సినిమాల్లోకి తెరంగేట్రం చేసింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మకు మంచి ప్రశంసలు దక్కడంతో కన్నడ సహా ఇతర భాషల నుండి కూడా ఈ హాట్ డ్యూటీ కి వరుస ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగా తెలుగు పరిశ్రమ వైపు అడుగులు వేసిన నేషనల్ క్రష్ రష్మిక మందన ,నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన 'ఛలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మంచి క్రేజ్ ను తీసుకు వచ్చింది.

ఆ తర్వాత తెలుగులో  డియర్ కామ్రేడ్, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, దేవ్ దాస్ వంటి పలు చిత్రాల్లో నటించి రష్మిక తెలుగు లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమా తో పాటు శర్వానంద్ హీరోగా నటిస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటు బాలీవుడ్ లో మిస్టర్ మంజు , గుడ్‌బై సినిమాలతో పాటు మరో సినిమాను కూడా ఒప్పుకుంది. అయితే ఈ సినిమాల కోసం ఎప్పుడూ ముంబాయి కి వెళ్లాల్సి వచ్చినా హోటల్ లో ఉండడం వల్ల విసిగిపోయిన రష్మిక ఒక ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలియజేసింది. తాజాగా మీడియాతో మాట్లాడిన రష్మిక మందన తనకు హోటల్ లో ఎక్కువ సమయం గడపడం అంటే ఇష్టం లేదు అని , అందుకే ముంబాయి లో ఒక ఇల్లు కొనుగోలు చేశాను అని తెలియజేసింది. అక్కడి నుండి షూటింగ్ లకు వెళ్లడం చాలా సౌకర్యంగా ఉంది అని కూడా తెలిపింది. ఇలా రష్మిక మందన తన కొత్త ఇంటి గురించి జనాలకు తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: