సౌందర్య కోసం రష్మిక అడుగులు !

Seetha Sailaja

సౌందర్య చనిపోయి 17 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ ఆమె నటించిన సినిమాలు టివి ఛానల్స్ లో వస్తున్నప్పుడు అనేకమంది చూస్తూనే ఉంటారు. ఈనాటితరం ప్రేక్షకులకు సౌందర్య తెలియకపోయినా ఆమె సినిమాలలో నేటితరం కనెక్ట్ అవుతూనే ఉన్నారు. దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోయిన్ గా ఒక దశాబ్దకాలం ఇండస్ట్రీని ఏలిన సౌందర్య కేవలం గ్లామర్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా నటనకు ప్రాధాన్యత ఇచ్చేది. పాత్రలను ఎంచుకుని తన ప్రత్యేకతను అప్పట్లో కొనసాగించేది.

ప్రస్తుతం బయోపిక్ ల సీజన్ కొనసాగుతోంది, ఇలాంటి సందర్భాలలో సౌందర్య బయోపిక్ కూడ తీస్తే బాగుండును అని అనిపించడం సహజం. అయితే అలాంటి బయోపిక్ పై ఇప్పుడు రష్మిక ఆశక్తి కనపరచడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో రష్మిక ను అక్కడ మీడియా వర్గాలు జూనియర్ సౌందర్య అని పిలుస్తూ ఉంటారు. రష్మిక కు కూడ మంచి నటిగా రాణించాలి అన్నకోరిక ఉంది. ప్రస్తుతతరం ప్రేక్షకులు మాత్రం క్రేజీ డాల్ గా మాత్రమే చూస్తున్నారు.


లేటెస్ట్ గా రష్మిక ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు సౌందర్య బయోపిక్ ఎవరైనా తీస్తే ఆసినిమాలో సౌందర్య పాత్రలో నటించాలి అన్న తన కోరిక బయటపెట్టింది. వాస్తవానికి బయోపిక్ ల సీజన్ కొనసాగుతూ ఉన్నప్పటికీ సౌందర్య జీవితంలో చెప్పుకోతగ్గ ఎత్తుపల్లాలు చీకటి కోణాలు లేవు. అలాంటి విషయాలు లేకుండా ఉన్న బయోపిక్ లను తీస్తే అవి డాక్యుమెంటరీలుగా మారుతున్నాయి. జయలలిత జీవితం పై తీసిన ‘తలైవి’ బయోపిక్ ను కనీసం తమిళ ప్రేక్షకులు కూడ పూర్తిగా ఆదరించలేదు.

ఇలాంటి పరిస్థితులలో సౌందర్య బయోపిక్ లను ఎవరు చూస్తారు అన్నది ప్రశ్న. సానుభూతిని కలిగించే సంఘటనలు లేవు ఆమె జీవితంలో పెద్దగా రూమర్స్ లు కూడ లేవు. ఈ పరిస్థితులలో ఒక్క మరణం విషయంలో తప్ప ఏవిషయంలోనూ సంచలనం లేని సౌందర్య జీవితాన్ని బయోపిక్ గా తీసినా ఎంతవరకు హిట్ అవుతుంది అన్నది ప్రశ్నార్థకం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: