భిక్షుయాదవ్ గా సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన విలన్..!
ప్రదీప్ రావత్ స్టార్ హీరోలకు చుక్కలు చూపించి , ఎన్నో సినిమాలలో తన కంటూ ఒక ప్రత్యేకమైన విలనిజాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో కి మొదట క్యారెక్టర్ ఆర్టిస్ గా అడుగుపెట్టిన ప్రదీప్ రావత్, ఆ తర్వాత తన నటనతో విలన్ గా అవతారం ఎత్తాడు. భారతదేశ టెలివిజన్ చరిత్రలో సంచలన విజయం అందుకున్న మహాభారతం సీరియల్ లో అశ్వద్ధామ పాత్రలో నటించి అందరిని ఆకట్టుకోవడంతో ఈయనకు బాలీవుడ్ లో వరుస ఆఫర్లు పోటెత్తాయి.
మొదటిసారిగా బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరోగా నటించిన సర్ఫరోష్ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక అదే అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన లగాన్ సినిమా లో విలన్ గా గుర్తింపు పొందాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా ప్రదీప్ రావత్ గుర్తింపు పొందాడు. అక్కడ మంచి గుర్తింపు పొందిన ప్రదీప్ రావత్ పై సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కన్ను వేసిందనే చెప్పాలి.
దర్శక ధీరుడు రాజమౌళి నితిన్ తో కలిసి తెరకెక్కించిన సై చిత్రం ద్వారా మొదటిసారిగా ప్రదీప్ రావత్ తెలుగు లో విలన్ గా అడుగుపెట్టాడు.ఈ సినిమాలో భిక్షుయాదవ్ గా, అతి క్రూరంగా నటించిన ప్రదీప్ రావత్ ను ఎవరు అంత త్వరగా మర్చిపోలేరు. ఆ తర్వాత ఈయన నటనతో తెలుగు, తమిళ ,కన్నడ, మలయాళ భాషలలో మోస్ట్ వాంటెడ్ విలన్ గా గుర్తింపు పొందుతూ ఒక వెలుగు వెలిగాడు. అంతే కాదు ఈయన బాలీవుడ్ లో మూడు సినిమాలలో హీరోగా కూడా నటించినప్పటికీ, అవి విడుదలకు నోచుకోలేదు. సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఒక మోడల్ గా బాగా పాపులర్ పొందిన ప్రదీప్ రావత్, ఆ తర్వాత ప్రముఖ టీవీ సీరియల్ నటి అలాగే మోడల్ అయిన కళ్యాణి రావత్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కూడా వున్నారు..