నాగచైతన్య కండిషన్స్ తో దిక్కులు చూస్తున్న మీడియా !

Seetha Sailaja
నాగచైతన్య సాయి పల్లవి ల ‘లవ్ స్టోరీ’ మూవీ ఈనెల 24న విడుదల కాబోతోంది. ధియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీని భారీ స్థాయిలో ప్రమోట్ చేయడానికి శేఖర్ కమ్ముల భారీ ప్లాన్స్ ఇప్పటికే డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ ప్రమోషన్ నిమిత్తం ఈ వీకెండ్ లో ఒక మీడియా సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించి అన్ని ప్రముఖ మీడియా సంస్థ ప్రతినిధులను ఆహ్వానించబోతున్నట్లు టాక్.

ఇప్పటికే ఈవిషయమై ఈమూవీ నిర్మాతలు నాగచైతన్య పిఆర్ టీమ్ ఈ మీడియా సమావేశానికి ఎవరెవర్ని పిలవాలి అన్న విషయంలో ఒక లిస్టును తయారుచేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి ఆహ్వానించే మీడియా సంస్థ ప్రతినిధులకు చైతన్య పిఆర్ టీమ్ ఒక కండిషన్ పెట్టబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

ఈ సమావేశానికి ఆహ్వానిమ్చాబోతున్న మీడియా సంస్థ ప్రతినిధులకు ఈ సినిమాకు సంబంధించి ఏఏ ప్రశంలు అడగాలి అన్న కొశ్చనీర్ ముందుగానే తయారుచేసి ఇస్తారట. కేవలం మీడియా ప్రతినిధులు ఆ ప్రశ్నలు మాత్రమే అడగాలి కానీ మరే ఇతర ప్రశ్నలు కానీ ముఖ్యంగా నాగచైతన్యకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు అడగ కూడదు అన్న కండిషన్ ను మీడియా సంస్థ ప్రతినిధులకు ముందుగానే చైతన్య పిఆర్ టీమ్ చెపుతారట.

దీని అర్థం సమంత చైతన్యల మధ్య ఏమి జరుగుతోంది అని ప్రశ్నించ కూడదు అన్న విషయం పరోక్షంగా మీడియా వర్గాలకు చెప్పినట్లే అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ పరిస్థితులు ఇలా ఉండగా చైతన్య సమంతల మధ్య గ్యాప్ ఏర్పడటంతో వారిద్దరూ ఫ్యామిలీ కోర్టు మెట్లు ఎక్కబోతున్నారని లేటెస్ట్ గా ఒక ప్రముఖ ఛానల్ కథనం ప్రసారం చేసినా ఆవిషయమై అటు చైతన్య కాని ఇటు సమంత కాని ఖండన ఇవ్వకపోడంతో ‘లవ్ స్టోరీ’ విడుదల చైతూ సమంత ల వివాహ బంధం పై ఒకేసారి క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంది అన్న ఊహాగానాలు ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: