ఎన్టీఆర్ కోసం ముగ్గురు.. ఎవరు ఫైనల్ అవుతారో..?

Anilkumar
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకోవడంతో.. ఇప్పుడు చేయబోతున్న ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్టీఆర్ కెరీర్లో లో 30 వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులే అవుతుంది.ఏప్రిల్ నెలలో ఈ సినిమాని అనౌన్స్ చేసారు మేకర్స్. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు.దీంతో అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.ఇక అప్డేట్ కోసం సోషల్ మీడియా మాధ్యమాల్లో # NTR30 హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

ఈ నేపథ్యంలో త్వరలోనే ఎన్టీఆర్ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాకు సంబంధించిన నటీ నటులు, టెక్నీషియన్లు తదితర వివరాలను అధికారికంగా ప్రకటించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.దీంతో నందమూరి అభిమానుల్లో మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా నటించే హీరోయిన్ ని ఇంకా ఫైనల్ చేయలేదు.కానీ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, కియారా అద్వానీ లలో ఎవరినో ఒకరిని తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ ఇద్దరు మాత్రమే కాకుండా కొత్తగా రష్మీక మందన పేరు కూడా వినిపిస్తోంది.

మరి ఈ ముగ్గురిలో ఎన్టీఆర్ కి జోడీగా ఏ హీరోయిన్ ని కొరటాల ఫైనల్ చేస్తారో చూడాలి.ఇక ఈ ముగ్గురు భామలు ఇప్పటి వరకు ఎన్టీఆర్ తో స్క్రీన్ ని షేర్ చేసుకోకపోవడం గమనార్హం.ఇక అక్టోబర్ లో NTR30 రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోనుంది.ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ ని ఎంపిక చేశారు మేకర్స్.సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలుని ఫైనల్ చేసే అవకాశం ఉంది.ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదట.'ఆచార్య' సినిమా పనులు పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ కథను పూర్తి చేయనున్నారు కొరటాల శివ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: