రిస్క్ వద్దంటున్న మహేష్ .... మరి గురూజీ వింటారా .... ??
14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చు తో రూపొందుతున్న ఈ సినిమాలో సముద్రఖని విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ అనంతరం హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ తీయనున్న ప్రతిష్టాత్మక సినిమాలో యాక్ట్ చేయనున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. యువ సంచలన నటి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి కూడా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించనుండగా సూర్యదేవర రాధాకృష్ణ దీనిని నిర్మించనున్నారు. ఇటీవల అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ మూవీని నవంబర్ మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు టాక్. అయితే భారీ యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీలో అత్యధిక భాగాన్ని విదేశాల్లో చిత్రికరించాల్సిన అవసరం ఉందని, ఇప్పటికే ప్రొడక్షన్ యూనిట్ లండన్, అమెరికా వంటి దేశాల్లో లొకేషన్స్ వెతుకులాటలో ఉన్నట్లు టాక్.
అయితే ప్రస్తతం మన దేశంతో పాటు ఆయా దేశాల్లో కూడా కరోనా కేసులు ఒకింత పెరుగుతున్న నేపథ్యంలో వీలైనంత వరకు పెద్ద రిస్క్ లేకుండా ఇండియా లోనే ఎక్కువ శాతం సెట్స్ వేసి మూవీ తీసేలా సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రమ్ కి సూచన చేశారట. నిజానికి మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఒకింత స్థిమితంగా ఉన్నాయి. మరి ఇంతకీ మహేష్ ఇచ్చిన సూచన గురూజీ పాటిస్తారా లేదా, మరి ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.