శ్యామ్ సింఘరాయ్ ఆ పండుగకే అంటున్న నాని..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని స్పీడ్ మామూలుగా లేదు. దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా తన సినిమాలను 'ఓటిటి' లలో విడుదల చేస్తూ తన హవాను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే నాచురల్ స్టార్ నాని ,సుధీర్ బాబు హీరోలుగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన  'వి' సినిమాను ప్రముఖ 'ఓటిటి' అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేసి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జనాలు థియేటర్లకు వచ్చే పరిస్థితులు లేవు అనే ఉద్దేశంతో నాని హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన 'టక్ జగదీష్' సినిమాను అమెజాన్ ప్రైమ్ 'ఓటిటి' లో విడుదల చేశాడు.

ఈ సినిమా కొంతమంది ప్రేక్షకులనుండి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోగా , మరి కొంతమంది ప్రేక్షకుల నుండి మాత్రం నెగటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇలా కరోనా సమయంలో కూడా దూసుకుపోతున్న నాని ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింఘరాయ్'  సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మడోనా సెబాస్టియన్ ,సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు . ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకోగా కరోనా పరిస్థితులవల్ల విడుదల కాకుండా ఆగిపోయింది. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు జనాల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా , ఈ సినిమాపై ఉన్న అంచనాలు కూడా మరింతగా పెంచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను నాని దీపావళి బరిలో ఉంచాలని ఆ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి శ్యామ్ సింఘరాయ్ సినిమాను థియేటర్ల ద్వారా జనాల ముందుకు తీసుకు వస్తారా.? లేక ఓటిటి ద్వారా ప్రజల ముందుకు తీసుకు వస్తారా అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. నాని ఈ సినిమా తో పాటు 'అంటే సుందరానికి' అనే సినిమా లో కూడా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: