రాజమౌళి వెంట పడుతున్న అగ్ర నిర్మాణ సంస్థ..?

Anilkumar
ప్రస్తుతం టాలీవుడ్లో  మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్లలో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి.అయితే ఇప్పటికే స్టార్ హీరోలయిన  మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, సుకుమార్, కొరటాల శివ లాంటి టాప్ డైరెక్టర్లతో ఆ సంస్థ సినిమాలు చేసింది.ఇక ప్రస్తుతం ఈ సంస్థ  అల్లు అర్జున్, మహేష్ బాబులతో పుష్ప, సర్కారు వారి పాట చిత్రాలను నిర్మిస్తోంది. ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లతోనూ మైత్రీ సినిమాలు చేయబోతున్న సంగతి తెలిసిందే.ఇదే కాకుండా కేజీఎఫ్ దర్శకుడు అయిన  ప్రశాంత్ నీల్-జూనియర్ ఎన్టీఆర్ కలయికలోనూ మైత్రీ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట.అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక  పాన్ ఇండియా సినిమా ను ఈ సంస్థ చేస్తుంది అని ఎప్పుడో ప్రకటించారు.

ఇలా టాప్ హీరోలు, డైరెక్టర్స్ తో అది ఇది అని కాకుండా ఎవ్వరినీ మైత్రీ వాళ్లు వదలట్లేదు.  అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు వారి కళ్లు దర్శక ధీరుడు రాజమౌళి మీద పడ్డాయట.అయితే తన పాత కమిట్మెంట్లు ప్రకారం ఒక్కొక్కటిగా పూర్తి చేసే క్రమంలో ముందుగా డీవీవీ దానయ్యతో 'ఆర్ఆర్ఆర్' చేశాడు రాజమౌళి. అయితే దీని తర్వాత నిర్మాత కె.ఎల్.నారాయణకు ఇచ్చిన హామీ మేరకు మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నారట. అయితే దీని తరువాత రాజమౌళి ఏ బేనర్‌కు సినిమా చేస్తాడని కూడా అంటున్నారు కానీ దానిపై పూర్తి క్లారిటీ లేదు. అయితే వీటన్నింటి తరువాత  జక్కన్న మైత్రీ సంస్థలో ఓ మెగా మూవీ చేస్తాడని వార్తలొస్తున్నాయి.

అయితే ఇదే కాకుండా రాజమౌళిని మైత్రీ అధినేతలు రవిశంకర్, నవీన్ కలిశారని..  ఓ సినిమా కోసం సూచనప్రాయంగా అంగీకారం కుదిరిందని టాలీవుడ్లో అందరూ అనుకుంటున్నారు.మైత్రీ సంస్థలో ఏం చేసినా భారీగానే ఉంటుంది మరి.ఇకపోతే రాజమౌళితో సినిమా అంటే ఎన్ని వందల కోట్లయినా బడ్జెట్ పెట్టడానికి  సిద్ధంగా ఉంటారు.అందుకని ఈ బేనర్లో ఒక భారీ పాన్ ఇండియా మూవీని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ప్రేక్షకులు.మరి రాజమౌళి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలతో సినిమా చేస్తే అందులో హీరోగా ఎవరు నటిస్తారు?అది ఏ జోనర్ లో తెరకెక్కబోతోంది అనే అంశాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: