అశ్వనీదత్ నిర్మాతగా చేసిన మొదటి సినిమా ఫలితం ఇదే ?
అలా అతి చిన్న వయసులోనే నిర్మాతగా మారిన అశ్వనీదత్ గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అశ్వనీదత్ వైజయంతి మూవీస్ అనే బ్యానర్ ను స్థాపించి సినిమాలను నిర్మించాడు. తాను నిర్మాతగా మారిన తర్వాతా తీసిన మొట్టమొదటి సినిమా అప్పట్లో రికార్డును సృష్టించింది. అశ్వనీదత్ స్వర్గీయ నందమూరి తారక రామారావుకు వీరాభిమాని. అయితే అనుకోకుండా సీనియర్ ఎన్టీఆర్ తోనే సినిమా చేసే అవకాశం వచ్చింది. అలా 1975 లో అశ్వనీదత్ నిర్మాతగా మొదటి సినిమా సీనియర్ ఎన్టీఆర్ హీరోగా "ఎదురు లేని మనిషి" ని తీశాడు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన వాణి శ్రీ హీరోయిన్ గా నటించింది. ప్రభాకర్ రెడ్డి, కాంతారావు మరియు జగ్గయ్య ఇతర పాత్రలలో నటించి మెప్పించారు. కె బాపయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్ లో విడుదలై శతదినోత్సవాన్ని జరుపుకుంది. ఇలా తీసిన మొదటి సినిమాతోనే నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. ఈ రోజు అశ్వనీదత్ తన 61 వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిద్దాం.