దోబూచులాటలాడుతున్న సీనియర్ హీరో లు!!

P.Nishanth Kumar
తెలుగు సినిమా పరిశ్రమ లో సీనియర్ హీరోలు గా ఉన్న చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ లు ఇప్పుడు తమ తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి అయితే ఏకంగా నాలుగు సినిమాలను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. వెంకటేష్ రెండు సినిమాలు, బాలకృష్ణ రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకు వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే వీరు ముగ్గురు నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. నిజానికి ఈ చిత్రాలు ఎప్పుడో పూర్తయినా కూడా ఇంకా విడుదలకు రాకుండా వీరు దోబూచులాడుతున్నారు అని చెప్పాలి.
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య దసరా నాటికి విడుదల చేయాలని గతంలో భావించగా ఆ దసరా కి కూడా ఈ సినిమా రావడం లేదని తెలుస్తుంది. దీంతో మెగా అభిమానులు ఒక్కసారిగా నిరాశ చెందారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ లేట్ కావడంతో ఇప్పుడు సరైన సమయం కాదని ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. ఇకపోతే నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ సినిమా అయినా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ప్రేక్షకులు ఆశిస్తూ ఉండగా అది కూడా ఇంతవరకు అధికారిక ప్రకటన చేయకపోవడం వారిలో నిరాశనే మిగిలిస్తుంది.
మరోవైపు వెంకటేష్ కూడా దృశ్యం2,  సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే వీరిద్దరిలో ఎవరో ఒకరు వస్తే కానీ తాను రావడానికి సిద్ధంగా లేనని వెంకటేష్ చెబుతున్నాడట. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల విషయం అలాగే నానుతూ ఉండడం, తెలంగాణలో పూర్తి స్థాయిలో థియేటర్ లు ఓపెన్ కాక పోవడం, ఓపెన్ అయినా ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడం వల్ల సీనియర్ హీరోలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీనియర్ హీరోల అభిమానులను వీరు ఏ విధంగా మెప్పిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: