మూడో ఆప్షన్ అతనే.. దేవిశ్రీ, తమన్ లకు చెక్ పెట్టేనా!!

P.Nishanth Kumar

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇద్దరే ఇద్దరు సంగీత దర్శకులు గత కొన్ని సంవత్సరాలుగా సంగీత ప్రపంచంలో టాలీవుడ్ ను ఏలుతున్నారు. దేవిశ్రీ కాకపోతే తమన్, తమన్ కాకపోతే దేవిశ్రీసాద్ ఇలా వీరిద్దరే టాలీవుడ్ లోని పెద్ద హీరోల సినిమాలకు సంగీతం అందిస్తు ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు కూడా తమన్ దేవి శ్రీ ప్రసాద్ లే టాప్ హీరోల సినిమాలను చెరి కొన్ని పంచుకున్నారు. దాంతో కొంత మంది ప్రేక్షకులు ఎప్పుడు చూసినా వీరిద్దరి సంగీతాన్ని వినాల్సి వస్తుందని పెదవి విరుస్తున్నారు. వాస్తవానికి మూడవ సంగీత దర్శకుడు టాలీవుడ్ లోకి రావడం కంపల్సరీ అయ్యింది.
కొంత మంది సంగీత దర్శకులు పెద్ద ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దేవిశ్రీ ప్రసాద్, తమన్ రేంజ్ సంగీతం ఇవ్వలేకపోయారు. ఇతర భాషల నుంచి కొంత మంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లు కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారు సైతం వీరి స్థాయి సంగీతం ఇవ్వలేక ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం మూడవ ప్రత్యామ్నాయంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు సమాధానంగా నిలుస్తున్నాడు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్. సినిమా పరిశ్రమలోకి వచ్చి సినిమాలు చేసి చాలా రోజులు అయినా మహతి స్వర సాగర్ కు ఇప్పుడిప్పుడే మంచి పేరు వస్తుంది. పెద్ద సినిమా అవకాశాలు వస్తున్నాయి.
చలో సినిమా లో చూసి చూడంగానే అనే పాట తో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తంను తనవైపు తిప్పుకున్న సాగర్ ప్రస్తుతం మంచి సంగీతాన్ని అందిస్తు ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చిన మహతి స్వర సాగర్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాకి సంగీతం సమకూర్చడం విశేషం. ఇప్పుడు కొంతమంది యువ హీరోల సినిమాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. నితిన్ హీరోగా నటిస్తున్న కొన్ని సినిమాలు అలాగే కొన్ని పెద్ద హీరోల సినిమాలు కూడా ఆయన చేస్తుండడం చూస్తుంటే టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మూడవ సంగీత దర్శకుడు దొరికినట్లే అనిపిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: