ఫ్లై క్యామ్ ఉపయోగించిన మొదటి తెలుగు చిత్రం..!
ఇకపోతే ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం గా 2008వ సంవత్సరంలో కళ్యాణ్ రామ్ హీరోగా డ్యుయల్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆర్ట్స్ కింద కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించారు. ఇందులో హీరోయిన్లుగా ప్రియమణి , సింధుతులానీలు నటించి తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.. ఇక ప్రధాన పాత్రల్లో బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, రఘుబాబు, ఆలీ తదితరులు నటించిన ఈ సినిమాకు నవ్వులు-పువ్వులు పూయించారు.
కాకపోతే అప్పటి వరకు వరకు ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా కొంత ఊరటనిచ్చింది అని చెప్పవచ్చు. ఇక వాణిజ్య పరంగా కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే కళ్యాణ్ రామ్ ఆ తర్వాత నటించిన ఏ సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందించకపోవడంతో ఆయన తిరిగి నిర్మాణ సంస్థలు చూసుకుంటూ ఎన్టీఆర్ నటించే పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే ఇటీవల మరోసారి కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించటానికి రెడీ అవుతున్నాడు కల్యాణ్ రామ్.