ప్రభాస్ ను బాగా వాడేస్తున్న ప్రశాంత్ నీల్!!

P.Nishanth Kumar
ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్ కెరియర్ లో ఈ చిత్రం స్పెషల్ గా తెరకెక్కుతోందని ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో దర్శకుడు ప్రభాస్ ను ఏ దర్శకుడు చూపని విధంగా గా ప్రశాంత్ చూపించబోతున్నాడు అని తెలుస్తుంది. ఇప్పటికే రాధే శ్యామ్ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నాడు ప్రభాస్. రొమాంటిక్ లవ్ స్టోరీ గా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదలైన కొన్ని నెలలకే సలార్ సినిమా ను ప్రభాస్ విడుదల చేయడం విశేషం.
కేజిఎఫ్ చిత్రాన్ని పూర్తి చేసి ఈ చిత్రాన్ని శరవేగంగా షూటింగ్ చేస్తున్న ప్రశాంత్ గత రెండు షెడ్యూల్స్ గా ప్రభాస్ ను గట్టి గా వాడేస్తున్నాడట. ఈ సినిమాలోని ఫైట్ సీన్స్ ను గత రెండు షెడ్యూల్ గా చేసినా కూడా పూర్తి కాకపోవడంతో మూడవ షెడ్యూల్ ను కూడా కేవలం యాక్షన్ సీన్స్ కోసమే కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ కోసమే బడ్జెట్లోని సగం బడ్జెట్ కేటాయించారని అంటున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు మరొక పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నాడు.
ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తూ ఉండగా అప్పుడే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ సినిమా విడుదల కావడం ఈ సినిమా విడుదలను కాదు అని చెప్పవచ్చు. రెండు సినిమాలకు ఓకే నిర్మాత కావడంతో కచ్చితంగా ఈ సినిమాని వేసవిలో మాత్రం విడుదల చేయరు. వచ్చే ఏడాది దసరాకు విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ బాలీవుడ్ లో ఆదిపురుష్ మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వం చేస్తున్న ప్రాజెక్ట్ సినిమా లు చేస్తున్నాడు.  ఇవే కాకుండా కూడా దిల్ రాజు నిర్మాతగా మరో సినిమా నీ కూడా చేయనున్నాడట. ఈ చిత్రాలు ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తాయో ప్రభాస్ ను ఎంతటి స్థానానికి తీసుకెళతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: