అందుకే తనను అలా ఎవరు పిలవలేదంటున్న ఎన్టీఆర్...!

murali krishna
యంగ్ టైగర్  ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీటీవీ ఛానల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారమవుతున్న విషయం అందరికి తెలిసిందే. తొలి వారంతో పోలిస్తే రెండో వారం భారీ రేటింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ షో రాబోయే రోజుల్లో భారీగా రేటింగ్స్ సాధిస్తుందని జెమినీ ఛానల్ నిర్వాహకులు మరియు ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారని సమాచారం.
షోలో పాల్గొన్న కంటెస్టెంట్లతో ముచ్చటిస్తూ ఎన్టీఆర్ తన వ్యక్తిగత విషయాలను కూడా చెబుతున్నారని తెలుస్తుంది.తాజాగా ఈ షోకు అంజనీ కుమార్ అనే వ్యక్తి హాజరు కాగా మిమ్మల్ని అజ్జూ అని పిలవాలా అని ఎన్టీఆర్ అడిగారని సమాచారం.
అవతలి వ్యక్తి అందరూ అజ్జు అనే పిలుస్తారని నాన్న మాత్రం అంజనీ కుమార్ అని పిలుస్తారని కంటెస్టెంట్ చెప్పారని సమాచారం. ఎన్టీఆర్ మంచి పేరు ఉన్నప్పుడు ఆ పేరు పెట్టి పిలవడం చాలా మంచిదని అందువల్లే తనను ఎవరూ చిన్నప్పుడు ముద్దుపేర్లు పెట్టి పిలవలేదని యంగ్ టైగర్ కామెంట్లు చేశారని తెలుస్తుంది . ఎన్టీఆర్ హోస్ట్ గా తనదైన శైలిలో ప్రశ్నలు అడుగుతూ ప్రేక్షకుల ప్రశంసలను పొందుతున్నారని సమాచారం. డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ షో ప్రసారం కానున్నట్లు సమాచారం.
ఎవరు మీలో కోటీశ్వరులు తర్వాత సీజన్లకు కూడా ఎన్టీఆర్ హోస్ట్ గా కొనసాగుతారేమో చూడాలి మరి. రాబోయే వారాల్లో ఈ షో రేటింగ్స్ ను బట్టి షో ఏ స్థాయిలో విజయం అందుకుందో తెలుస్తుంది. బిగ్ బాస్ షో నుంచి రేటింగ్స్ విషయంలో ఎవరు మీలో కోటీశ్వరులు షోకు గట్టి పోటీ ఎదురవుతోందని సమాచారం.

బిగ్ బాస్ నుంచి  ఎంత గట్టి పోటీ వచ్చిన ఎన్టీఆర్ హోస్టింగ్ మీద గట్టి నమ్మకం పెట్టుకుందట జెమినీ టీవీ నెట్వర్క్. ఎన్టీఆర్ వచ్చిన తరువాతే ఈ షో కు గత సీజన్ల కంటే  భారీ రేటింగ్ వచ్చినట్లు తెలుస్తుంది. మరి చూడాలి ముందు ముందు ఎన్ని రికార్డ్స్ కోళ్లగొడతారో ఎన్టీఆర్...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: