మహేష్ - త్రివిక్రమ్ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ ఆరోజే .... ??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలో ఒక భారీ సినిమా తీయనున్న విషయం తెల్సిందే. ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందించనుండగా ప్రముఖ ఛాయాగ్రాహకుడు మది ఫోటోగ్రఫి అందించనున్నారు.
ఇప్పటికే ఈమూవీ స్టోరీ సూపర్ స్టార్ కి వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రస్తుతం దీని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఇక ఈ సినిమాలో మహేష్ కి జోడీగా పూజ హెగ్డే నటించనుంది. త్వరలో స్క్రిప్ట్ పూర్తి అయిన అనంతరం మిగతా ఇతర నటీనటులు ఎంపిక కూడా ప్రారంభం కానుందట. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ ఈ మూవీని తీయనున్నారని, గతంలో మహేష్ తో త్రివిక్రమ్ తీసిన ఖలేజా మూవీ భారీ ఫ్లాప్ మూటగట్టుకోగా ఈసారి అలా కాకుండా పక్కాగా కమర్షియల్ జానర్ లో సినిమా తీసి సూపర్ స్టార్ కి పక్కాగా బ్లాక్ బస్టర్ అందించాలని త్రివిక్రమ్ ఎంతో కసితో వర్క్ చేస్తున్నట్లు సమాచారం.
అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా టైటిల్ విషయమై కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న కథనాల ప్రకారం ఈ మూవీకి పార్ధు, అతడే పార్ధు అంటే టైటిల్స్ ని యూనిట్ అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా ఈ రెండిటిలో దేనిని ఫైనల్ చేస్తారు అనే విషయం ప్రక్కన పెడితే పక్కాగా టైటిల్ అనౌన్స్ మెంట్ ని మాత్రం అక్టోబర్ 15 దసరా రోజున ప్రకటన చేయాలని యూనిట్ ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు. అలానే దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందని టాక్. మరి ఇది నిజమో కాదో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: