రేపు ప్రభాస్ ప్రాజెక్ట్ కె నుండి భారీ అప్ డేట్ ... ??

GVK Writings
బాహుబలి స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తుండగా అందులో రాధేశ్యామ్ మూవీ ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ మూవీ 2022 సంక్రాంతికి విడుదల కానుండగా దీని తో పాటు ఆయన సలార్, ఆదిపురుష్, అలానే ప్రాజక్ట్ కె మూవీ షూట్స్ లో కూడా వరుసగా పాల్గొంటున్నారు. అయితే వీటిలో నాగ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న సినిమా ప్రాజక్ట్ కె. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ ఒక కీలక రోల్ చేస్తున్నారు.
ఇటీవల ఈ మూవీ షూట్ ప్రారంభం కాగా ప్రస్తుతం దీనికి సంబంధించి హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు టాక్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్స్ కథాంశంతో సాగనుండగా ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కే కొన్ని కోట్ల రూపాయలు కేటాయించనున్నారట. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనే రేంజ్ లో ఉండనుందట.
అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రేపు ఈ మూవీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ పుట్టినరోజు సందర్భంగా ప్రాజక్ట్ కె నుండి ఒక భారీ అప్ డేట్ ని యూనిట్ ప్లాన్ చేసిందని, అయితే అది ముందుగానే రివీల్ చేయడం కంటే రేపు సడన్ గా ప్రకటిస్తే బాగుంటుందని వారు భావిస్తున్నారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ కనుక నిజం అయితే రేపు ప్రభాస్ ఫ్యాన్స్ కి పెద్ద పండుగే అని చెప్పకతప్పదు. కాగా ఈ సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది చివర్లో లేదా ఆపై ఏడాది ప్రధమంలో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుందట యూనిట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: