మౌనమేలనోయి.. ప్రభాస్ కాస్త నోరు తెరువు!!

P.Nishanth Kumar
వరుసగా నాలుగు సినిమాలతో రెబల్ స్టార్ ప్రభాస్ దేశంలోని అందరి హీరోలకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ సినిమా లు చేస్తున్నాడు. ఒకేసారి నాలుగు సినిమాలు చేయడమే కాకుండా ఇప్పుడు సరికొత్త గా మరో పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా ప్రభాస్ చేస్తున్న రాధే శ్యామ్ సినిమాను విడుదల చేస్తుండగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలనే పట్టుదలతో శరవేగంగా చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు ప్రభాస్.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో జరుగుతుండగా రాధాకృష్ణ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా వింటేజ్ ప్రేమ కథా చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సలార్, ఆదిపురుష్ సినిమాలను విడుదల చేయనున్నాడు ప్రభాస్. ఈ చిత్రల షూటింగ్ దాదాపు 50 శాతం పూర్తయ్యాయి అని తెలుస్తుంది. ఇక నాగ్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా ఇప్పటికే మొదలు అయ్యింది ఈ విధంగా ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తూ ప్రభాస్ ఫుల్ బిజీగా గడుపుతున్న తాజాగా మరొక సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి.

దీనికి నిర్మాత గా దిల్ రాజు ఉన్నారు అంటున్నారు. వృందావన అనే సినిమా ను భారీ బడ్జెట్ తో ప్రభాస్ హీరోగా దిల్ రాజు తెరకెక్కిస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు భారీగా వస్తుండగా దీని గురించి ఇంతవరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే అధికారిక ప్రకటన ఇస్తే పోలా అని ప్రభాస్ అభిమానులు అంటున్నారు. ప్రభాస్ నోరు తెరిస్తే కానీ దీని గురించి నిజానిజాలు తెలీవు అని అభిమానులు భావిస్తుండగా తొందరగా దీనిపై ఒక విషయం చెప్తే బాగుంటుందని వారు డిమాండ్ చేస్తున్నారు. వరుస సినిమాలతో పాన్ ఇండియా హీరోలలో నెంబర్ వన్ గా ఉన్న ప్రభాస్ ఈ చిత్రంతో పేరుఏ రేంజ్ కి వెళ్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: