త్రిష తో కలిసి పెట్టుబడులు పెడుతున్న రష్మిక...?

Sahithya
టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్లు పెట్టుబడులు పెట్టడానికి కథలు మంచిగా ఉంటే సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే రష్మిక మందన గత కొన్ని రోజులుగా కథలు కోసం ఎదురుచూస్తోంది .ఇప్పుడు సినిమాలు అన్నీ కూడా ఆన్లైన్లో విడుదల కావడంతో ఆమె కాస్త జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలు చేసే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్న రష్మిక మందన ఇక ముందు కొన్ని కొన్ని సినిమాల విషయంలో పగడ్బందీగా ముందుకు వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.

 ఈ నేపథ్యంలోనే కొన్ని సినిమాలకు సంబంధించి కథలు కూడా రష్మిక మందన  విన్నదని ముఖ్యంగా చిన్న చిన్న సినిమాలను చేసేందుకు కొంత మంది యువ దర్శకులను ఎంపిక చేస్తుందని అంటున్నారు. కన్నడంలో ఇప్పటికే రష్మిక మందన  ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టిందని త్వరలో తెలుగులో కూడా మొదలు పెట్టవచ్చని టాలీవుడ్ వర్గాల భోగట్టా. త్వరలోనే దీనికి సంబంధించి రష్మిక మందన  ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. కథను సిద్ధం చేయించి పెట్టారని దాదాపుగా మూడు కథలు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాయని త్రిషతో కలిసి ఆమె నిర్మాతగా మారారని సమాచారం.

 తమిళంలో కూడా కొన్ని సినిమాలకు రష్మిక మందన నిర్మాతగా వ్యవహరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని పెట్టుకున్నారు కూడా టాక్. మరి ఈ ప్రణాళికను ఏవిధంగా ముందుకు వెళ్తాయి ఏంటి అనేది చూడాలి. టాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక మందన వరస సినిమా లతో దూసుకు పోతోంది మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సరసన ఆమె ఇప్పటికే నటించిన సంగతి మనకు తెలుసు అలాగే త్వరలోనే మరికొంతమంది స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆమె నటించే అవకాశం కనపడుతోంది పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా రష్మిక మందనను హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: