మొదట్లో అదరగొట్టినా . ఆ తరువాత తేలిపోయింది!!

P.Nishanth Kumar
సినిమా పరిశ్రమలో హీరోయిన్ లకు కు చాలా తక్కువ టైం స్పాన్ కెరియర్ ఉంటుంది. బాగా రాణించిన హీరోయిన్ గట్టిగా పదేళ్లు మించి ఉండదు. గతంలో హీరోయిన్లు దశాబ్దాలుగా చలన చిత్ర పరిశ్రమను ఏలగా ఇప్పుడు 1,2 సంవత్సరాలకే కనుమరుగై పోతున్నారు కొంత మంది ముద్దుగుమ్మలు. ఆ విధంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు వచ్చిన కొత్తలో మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత కొన్ని పొరపాట్లతో సినిమా పరిశ్రమకు దూరం అయి పోతూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు రెజీనా.

సుధీర్ బాబు హీరోగా నటించిన శివ మనసులో శృతి అనే చిత్రంతో హీరోయిన్ గా చేసి టాలీవుడ్ కి పరిచయమైన ఈమె తొలి సినిమాతోనే బెస్ట్ ఫిమేల్ నటిగా సైమా అవార్డు అందుకుంది. ఆ తర్వాత ఈమె వరుస చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. రొటీన్ లవ్ స్టోరీ కొత్త జంట పిల్లా నువ్వు లేని జీవితం వంటి సినిమాలతో హిట్లు సాధించిన రెజీనా స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈమె మొదట్లో సాధించిన సూపర్ హిట్ లు ఆ తరువాత సాధించలేక పోయింది దాంతో తెలుగులో కనుమరుగవడం జరిగింది. 

పెద్ద హీరోల సినిమాల్లో భారీ అవకాశాలు రాబట్టలేకపోయింది రెజీనా. మీడియం రేంజ్ హీరోలతో మాత్రమే నటించి యావరేజ్ ఇమేజ్ దక్కించుకుంది. తమిళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుని అక్కడ కూడా యావరేజ్ హీరోయిన్ గా మిగిలిపోయిన ఈమె ఆ తర్వాత పెద్దగా అలరించలేకపోయింది. తెలుగులో ఆమె ఆఖరి చిత్రం గోపీచంద్ హీరోగా నటించిన సౌఖ్యం. ఇది కూడా భారీ ఫ్లాప్ కావడంతో తెలుగులో తన కెరీర్ కు స్వస్తి చెప్పక తప్ప లేదు. ప్రస్తుతం ఆచార్య సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తుంది. దీంతోనైనా ఆమె మళ్లీ కం బ్యాక్ చేస్తుందో చూడాలి. అంతేకాకుండా ఇంకా కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: