స్టార్ హీరోల పై ప్రకాష్ రాజ్ ఆసక్తికర కామెంట్స్ !

Seetha Sailaja
గత పార్లమెంట్ ఎన్నికలలో ఓటమి ప్రకాష్ రాజ్ కు అనేక పాఠాలు నేర్పించినట్లు కనిపిస్తోంది. ఈ అనుభవంతో వచ్చేనెల 10వ తారీఖున జరగబోతున్న ‘మా’ సంస్థ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా చాల పక్కా వ్యూహాలు రచిస్తున్నాడు. సాధారణంగా ఆవేసపరుడైన ప్రకాష్ రాజ్ తన తీరుకు భిన్నంగా బండ్ల గణేష్ ఎన్ని వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ చాల కూల్ గా సమాధానాలు ఇస్తూ ఉండటం చూసినవారికి ప్రకాష్ రాజ్ కు రాజకీయాలు బాగా వంటపట్టిన్నట్లు అనిపిస్తున్నాయి.

ఈపరిస్థితులు ఇలా ఉండగా ఒకప్రముఖ కన్వెంషన్ హాల్ లో ప్రకాష్ రాజ్ ఏర్పాటుచేసిన ‘సినిమా బిడ్డలం’ కార్యక్రమానికి ప్రకాష్ రాజ్ ప్యానల్ లోని సభ్యులు అందరితో పాటు సుమారు 150 మంది ‘మా’ సంస్థ సభ్యులు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈకార్యక్రమంలో ప్రకాష్ రాజ్ తన ప్యానల్ తరఫున త్వరలో విడుదలచేయబోయే మ్యానిఫెస్టో గురించి చాలలోతుగా చర్చించడమే కాకుండా తాను మా సంస్థ అధ్యక్షుడుగా ఎన్నికైన వెంటనే ‘మా’ సంస్థ కార్పస్ ఫండ్ కు 10కోట్ల విరాళం ఇచ్చి ఆతరువాత తాను టాప్ హీరోల వద్దకు వెళతాను అని చెప్పినట్లు టాక్.

ఇదేసందర్భంలో టాప్ హీరోల తీరుపై ప్రకాష్ రాజ్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. తాను వ్యక్తిగతంగా 10కోట్ల ఫండ్ ను మా సంస్థకు ఇచ్చాక ఏటాప్ హీరో అయినా తనకంటే ఎక్కువ ఎమౌంట్ విరాళంగా ఇస్తారు కానీ తనకంటే తక్కువ ఎమౌంట్ విరాళంగా ఇవ్వరు అన్ననమ్మకం తనకు ఉంది అని చెప్పినట్లు తెలుస్తోంది. ఈపరిస్థితులు ఇలాఉండగా ప్రస్తుతానికి మా ఎన్నికల విషయంలో ప్రకాష్ రాజ్ ప్యానల్ ముందడుగులో ఉంది అన్న సంకేతాలు వస్తున్నాయి.

మంచు విష్ణు ప్యానల్ కు సంబంధించి ఇప్పటివరకు ఏఒక్క వ్యక్తి పేరు బయటకు రాకపోవడంతో చివరి నిముషంలో చిరంజీవి మోహన్ బాబు కృష్ణంరాజు మురళీమోహన్ ల రాయబారంతో మంచు విష్ణు పోటీ నుంచి తప్పుకుని హుందాగా వ్యవహరించే పరిస్థితి కనిపిస్తోంది అంటు మరికొంతమంది విశ్లేషణలు చేస్తున్నారు. అయితే బండ్ల గణేష్ మెగా ఫ్యామిలీ భజన తారా స్థాయికి చేరుకోవడంతో ఈభజన వల్ల అతడికి ఏమైనా మేలు జరుగుతుందా లేదంటే అతడు కూడ మెగా ఫ్యామిలీ సలహాతో చివరి నిముషంలో పోటీ నుంచి తప్పుకుంటాడ అన్న సందేహాలు కూడ కొందరు వ్యక్తపరుస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: