థమన్ పై ఫైర్ అవుతున్న ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ .... ??

GVK Writings
యువ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించిన అలవైకుంఠపురములో మూవీ లోని సాంగ్స్ జాతీయ స్థాయిలో ఎంతో పెద్ద పాపులర్ అవ్వడంతో పాటు అటు యూట్యూబ్ లో అయితే వందల మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడం జరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా గతేడాది రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. ఆ విధంగా మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రస్తుతం తారా స్థాయిలో కొనసాగుతున్న థమన్ కి ప్రస్తుతం టాలీవుడ్ లో పలువురు బడా హీరోల సినిమాల ఛాన్స్ లు వస్తున్నాయి.
ఇప్పటికే థమన్ చేతిలో మహేష్ సర్కారు వారి పాట, నెక్స్ట్ ఆయన త్రివిక్రమ్ తో చేయనున్న మూవీ, పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్, రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న భారీ ప్రాజక్ట్, మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, నటసింహం బాలకృష్ణ అఖండ, తదుపరి గోపీచంద్ మలినేని తో చేయనున్న మూవీ. ఇక వీటితో పాటు మరికొన్ని ఇతర ప్రాజక్ట్స్ కూడా చేజిక్కించుకున్న థమన్, ఆయా సినిమాల సాంగ్స్ అన్ని కూడా అదరగొడుతున్నట్లు సమాచారం.
తరచు ఫ్యాన్స్ తో తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా టచ్ లో ఉండే థమన్, ఇటీవల మహేష్ సర్కారు వారి పాట, బాలయ్య అఖండ మూవీస్ నుండి ఫస్ట్ సాంగ్స్ త్వరలో రిలీజ్ కానున్నాయి అంటూ ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కి పోస్ట్ ల ద్వారా తెల్పడం జరిగింది. అయితే మరోవైపు ఇప్పటికే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ తమ తమ హీరోల సినిమాల నుండి ఒక్క సాంగ్ కూడా బయటకు రాకపోవడంతో మహేష్, బాలయ్య ఫ్యాన్స్ థమన్ పై ఒకింత అసహనాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. కాగా లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం ఈ రెండు సినిమాల నుండి తొలి సాంగ్స్ రాబోయే దసరా కు విడుదల కానున్నాయని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మరొక నెలరోజులు ఓపిక పట్టక తప్పేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: