జేమ్స్ బాండ్ గా ప్రభాస్ .... ??

GVK Writings
బాహుబలి ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న నాలుగు సినిమాల్లో రాధాకృష్ణ తీస్తున్న రాధేశ్యామ్ సినిమా ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా మిగతా మూడు సినిమాలైన సలార్, ఆదిపురుష్, ప్రాజక్ట్ కె మూవీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఇటీవల సలార్ కోసం కొద్దిగా వెయిట్ పెరిగిన రెబల్ స్టార్, ఇకపై మరింతగా తగ్గి ఆదిపురుష్, ప్రాజక్ట్ కె షూటింగ్స్ లో పాల్గొననున్నట్లు టాక్.
త్వరలో పలువురు హాలీవుడ్ నిపుణుల ఆధ్వర్యంలో ఫుడ్ తో పాటు వ్యాయామాల విషయంలో ప్రభాస్ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోనున్నారట. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో రాధేశ్యామ్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇటీవల దీని అఫీషియల్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఇక ఆ తరువాత సలార్ మూవీ ఏడాది సెకండ్ హాఫ్ లోను, అలానే ఆదిపురుష్ అదే ఏడాది చివరి నెలలో, అన్నిటికంటే ఫైనల్ గా నాగ అశ్విన్ తో ఆయన చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రాజక్ట్ కె ఆపై ఏడాదిలో విడుదల కానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాల తరువాత మైత్రి మూవీ మేకర్, అలానే డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ప్రభాస్ మరొక రెండు సినిమాలు చేయనున్నారని, ఇప్పటికే వీటికి సంబంధించి ఆయా నిర్మాతలతో ఒప్పందం కూడా జరిగిందట.
అయితే వీటి అనంతరం ఒక ప్రముఖ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో ప్రభాస్ అత్యధిక బడ్జెట్ లో బాండ్ మూవీ చేయనున్నారు అనేది లేటెస్ట్ బి టౌన్ వర్గాల సమాచారం. ఇటీవలస సదరు దర్శకుడు ముంబై నుండి ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి ప్రభాస్ కి కథ వినిపించగా అది ఎంతో నచ్చిన ప్రభాస్, పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమన్నట్లు సమాచారం. ఎంతో గ్రాండ్ లెవెల్లో ఇండియన్ హిస్టరీ లో నిలిచిపోయే మూవీగా ఈ సినిమా రూపొందనుందని, ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ తో పాటు విజువల్స్ భారీ స్థాయిలో ఉండనున్నాయని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ కనుక నిజం అయితే మన రెబల్ స్టార్ ని త్వరలో జేమ్స్ బాండ్ తరహా పాత్రలో చూడవచ్చని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: