ముంబై కి షిఫ్ట్ అవుతున్న సామ్.. ఎందుకో తెలుసా..?

Anilkumar
అక్కినేని కోడలు సమంత పేరు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది.చైతూ తో సమంత విడాకులు తీసుకోబోతుందనే గాసిప్ మాత్రం ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఈ విషయాన్ని అటు సమంత కానీ,ఇటు నాగ చైతన్య కానీ అంతగా పట్టించుకోలేదు.ఇక ఇదిలా వుండగా సమంత తన కెరీర్ కి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అదేంటంటే ఈ అక్కినేని కోడలు త్వరలోనే ముంబై కి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటోందట.ప్రస్తుతం సమంత ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ ను సైన్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.అయితే గతంలో కూడా సమంత కి బాలీవుడ్ లో పలు అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె పెద్దగా వాటిపై ఆసక్తి చూపలేదు.

కానీ ఇప్పుడు మాత్రం ఆమె హిందీ సినిమాల్లో నటించడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.ఇటీవల సమంత కీలక పాత్రలో నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్2' అనే హిందీ వెబ్ సీరీస్ కి బాలీవుడ్ లో సమంతకి మంచి క్రేజ్ దక్కింది.ఈ వెబ్ సీరీస్ లో సమంత నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.పైగా ఈ మధ్య కాలంలో బాలీవుడ్ మేకర్స్ చాలా మంది సౌత్ హీరోయిన్ల వైపు చూస్తున్నారు.ఇప్పటికే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన తార ఓ సినిమాలో కలిసి నటించబోతోంది.అందుకే సమంత కూడా అదే దిశగా అడుగులు వేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.ఈలోగానే ముంబై లో ఓ ప్లాట్ ని కూడా కొనుగోలు చచేసిందని..

అక్కడ తనకంటూ ఓ పీఆర్ ని, మేనేజర్ ని నియమించుకుందని తెలుస్తోంది.ఇక ఇదిలా ఉంటె కొన్నాళ్ళ పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఇటీవల సమంత ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆ బ్రేక్ అవ్వగానే..సమంత బాలీవుడ్ లో ఒకట్రెండు సినిమాలు చేయబోతోందట.ఇక రీసెంట్ గా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శాకుంతలం' సినిమా షూటింగ్ ని పూర్తి చేసింది సమంత.ఇక ఈ సినిమా షూటింగ్ ని కేవలం 80 రోజుల్లోనే పూర్తి చేశారు చిత్ర యూనిట్.ఇక ఈ ఏడాది చివర్లో కానీ,వచ్చే ఏడాది ఆరంభంలో కానీ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇక సమంత ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: