మహేష్ రీసెంట్ యాడ్ పై నెటిజన్ల విమర్శలు.. కారణం అదేనా..?

Anilkumar
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి సౌత్ లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఇదే క్రేజ్ తో మహేష్ సినిమాలతో పాటూ మరికొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఫుల్ పాపులారిటీని పెంచుకుంటున్నాడు.మహేష్ కేవలం సినిమాల్లోనే స్టార్ కాదు.. బుల్లితెరపై కూడా టాప్ స్టారే.ముఖ్యంగా యాడ్స్ విషయంలో మహేష్ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు.ప్రస్తుతం ఈ సూపర్ స్టార్ డజనుకు పైగా బ్రాండ్స్ ను ఎండోర్స్ చేస్తున్నాడు.ఇక తాను ఎండోర్స్ చేసే బ్రాండ్స్ విషయంలో పక్కాగా వ్యవహరించే మహేష్..రీసెంట్ గా చేసిన ఓ యాడ్ మాత్రం మహేష్ అభిమానులతో పాటు మరికొన్ని వర్గాలను నిరుత్సాహానికి గురిచేసింది.

అదే పాన్ బాహార్ అనే యాడ్.ముఖ్యంగా గుట్కాను సప్లై చేసే ఈ బ్రాండ్ పై ఇప్పటికే చాలా విమర్శలు ఉన్నాయి.ఈ పొగాకు ఉత్పత్తులను వాడటం ద్వారా క్యాన్సర్ వస్తుందననేది ప్రధాన అభియోగం.అయితే ఇవేం నిరూపించబడలేదు.కానీ అసలు ఇన్ని అభియోగాలు ఉన్న బ్రాండ్ ను మహేష్ బాబు ఎందుకు ఎండోర్స్ చేయాల్సి వచ్చింది అనేది నెటిజన్లు అడిగే ప్రధాన ప్రశ్న.ఇప్పటికే బోలెడు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్న మహేష్ బాబు పాన్ బాహార్ కు మాత్రం దూరంగా ఉండాల్సింది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు సైతం ఈ యాడ్ పై రకరకాల విమర్శలు చేస్తున్నారు.ఇక ఇప్పటినుంచి అయినా మహేష్ ఇలాంటి యాడ్స్ చేసే విషయాల్లో..

 జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మహేష్ సినిమా విషయానికి వస్తే.. పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నాడు.14రీల్స్, జిఎంబీ క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా కీర్తీ సురేష్ కథానాయికగా నటిస్తోంది.బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.సినిమాలో మహేష్ బ్యాంక్ మేనేజర్ గా కనిపించనున్నాడు.ఇప్పటికే విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: